📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

కులగణన రీసర్వే పూర్తి.. కొత్తగా ఎన్ని ఫ్యామిలీలంటే ?

Author Icon By sumalatha chinthakayala
Updated: March 1, 2025 • 12:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి నిర్వహించిన సమగ్ర ఇంటింటి కుల గణన సర్వే కూడా పూర్తయింది. ఇందులో సైతం ఆశించిన సంఖ్యలో కుటుంబాలు తమ వివరాలు నమోదు చేసుకోలేదు. మొదటిసారి నిర్వహించిన కుల గణన సర్వేలో 3.56 లక్షల కుటుంబాలు వివరాలు నమోదుచేసుకోకుండా మిగిలిపోయాయి. వీరికోసం రెండోసారి సర్వే నిర్వహించినా.. 18,539 కుటుంబాలు (5.21%) మాత్రమే ఎంట్రీ చేయించుకున్నాయి.

ఇంకా 3,37,964 ఫ్యామిలీలు

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,15,71,457 కుటుంబాలు ఉన్నట్టు గుర్తించగా.. గత నవంబరు 6 నుంచి డిసెంబరు 25 వరకు జరిగిన మొదటి సర్వేలో 1,12,15,134 కుటుంబాల(96.9) వివరాలు నమోదయ్యాయి. ఇంకా 3,56,323 (3.1 శాతం) కుటుంబాలు మిగిలిపోవడంతో వారి వివరాల నమోదు కోసం ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు రెండోసారి సర్వే నిర్వహించారు. ఈ రీసర్వేలో18,539 కుటుంబాలే వివరాలు ఎంట్రీ చేయించుకున్నాయి. దీంతో రెండు సర్వేలు పూర్తయిన తర్వాత కూడా ఇంకా 3,37,964 ఫ్యామిలీలు మిగిలిపోయాయి.

కులాల లెక్కల్లో స్వల్ప మార్పులు

మొత్తంగా రెండు సర్వేల్లో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 1,12,33,673(97.08 శాతం) కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి. సర్వే సులభంగా పూర్తయ్యేందుకు వీలుగా ప్రభుత్వం వివిధ రకాలుగా అవకాశం కల్పించింది. టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తే అధికారులే ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. కుల గణన రీసర్వేలో నమోదైన18 వేలకుపైగా కుటుంబాలను అప్ డేట్ చేయడంతో కులాల లెక్కల్లో స్వల్ప మార్పులు జరగనున్నాయి. ఫస్ట్ సర్వే తర్వాత ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఎస్సీల జనాభా 17.43 శాతం (61,84,319), ఎస్టీల జనాభా 10.45 శాతం (37,05,929 ), బీసీల జనాభా 46.25 శాతం (1,64,09,179) ఉన్నట్టు పేర్కొన్నారు.

Breaking News in Telugu Caste survey Google news Google News in Telugu Latest News in Telugu new families Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.