📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం

Author Icon By sumalatha chinthakayala
Updated: March 19, 2025 • 11:28 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana Budget: తెలంగాణ 2025-26 వార్షిక బడ్జెట్‌ కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత జరిగిన కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. ఈ మేరకు బడ్జెట్‌‌ను ఆర్ధిక మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కేబినెట్‌లో ప్రతిపాదించారు. ఈ మేరకు మంత్రి‌వర్గం బడ్జెట్‌ ఆమోద ముద్ర వేసింది. అనంతరం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క , అటు శాసన‌మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత రెండోసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడుతోన్న తరుణంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోందని అటు విపక్షాల్లోనూ.. ఇటు ప్రజల్లోనూ ఎంతో ఆసక్తి నెలకొంది.

కాంగ్రెస్ సర్కార్ కీలక ప్రకటనలు

కాగా, ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రధానంగా ఆరు గ్యారంటీ ల అమలుపైనే దృష్టి పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ పథకాలకు కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయనే ఉత్కంఠ నెలకొంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్రంలోని ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈసారి ఆర్ధిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క రూ.3.20 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశ‌పెట్టే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇక, ఆరు గ్యారంటీల్లో ఒకటైన సామాజిక పింఛన్ల పెంపు ద్వారా ఏటా రూ.3,500 కోట్ల మేర అదనపు భారం పడుతుందని, ఈ మేరకు పింఛన్ల బడ్జెట్‌ పెంచుతారని సమాచారం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ వంటి పథకాల కొనసాగింపునకు అవసరమైన మేర నిధులు కేటాయించనున్నారు.

Breaking News in Telugu Cabinet approves Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telangana Budget Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.