📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

KTR : ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు : కేటీఆర్

Author Icon By sumalatha chinthakayala
Updated: April 21, 2025 • 8:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

KTR : తెలంగాణలో ఈ ఏడాదిలోనే ఉప ఎన్నికలు వస్తాయని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉప ఎన్నికలకు టిఆర్ఎస్ నేతలు, క్యాడర్ సిద్ధంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. అత్తాపూర్ డివిజన్ కు చెందిన కాంగ్రెస్ నేత వనం శ్రీరామ్ రెడ్డి కేటీఆర్ సమక్షంలో ఆదివారం నాడు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మాటలన్నీ బోగస్. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆర్ గ్యారంటీల్లో ఒక్కటి కూడా ఇప్పటివరకు పూర్తి చేయలేదన్నారు.

పెరగాల్సిన భూముల ధరలు, నేల చూపులు చూస్తున్నాయి

కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వడం ఎలా ఉందంటే తినే కంచంలో మనమే మన్ను పోసుకున్నట్లు అయ్యింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. కానీ బస్సుల్లో అక్క చెల్లెలు కొట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. టీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరం నేడు వెలవెలబోతోంది. కేసీఆర్ పాలనలో రియల్ ఎస్టేట్ కొత్త గుంతలు తొక్కగా.. నేడు కాంగ్రెస్ పాలనలో అతి తక్కువ కాలంలో రియల్ భూమ్ పడిపోయింది. పెరగాల్సిన భూముల ధరలు, నేల చూపులు చూస్తున్నాయి. అభివృద్ధి లేకపోవడమే అందుకు కారణం.

కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు శత్రువులే

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమితో పార్టీ నేతల కంటే ప్రజలకు ఎక్కువ నష్టం జరిగింది. ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు అంటూ సామాన్యుల ఇండ్లు సైతం కూల్చివేసి ఇబ్బందులకు గురిచేశారు. రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు శత్రువులే. కేసీఆర్ మరోసారి సీఎం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, వారి పాలనా వైఫల్యాన్ని ప్రజలు గమనిస్తున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు.

Read Also: హైడ్రా లాగా మేము ‘కోబ్రా’ తీసుకు వస్తాం: బీఆర్‌ఎస్‌ నేతలు

BJP Breaking News in Telugu brs by-elections congress Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telangana Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.