📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Budget 2026-27: తెలంగాణకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి.. పొన్నం ప్రభాకర్

Author Icon By Saritha
Updated: January 31, 2026 • 5:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంతో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) సయోధ్య కోరుకుంటోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ (Budget 2026-27) అన్నారు. వచ్చే కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేంద్రం నిధులు కేటాయించేలా రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు కృషి చేయాలని సూచించారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం జరగాలని ఆకాంక్షించారు.

Read Also: Budget 2026: ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే!

(Budget 2026-27) బడ్జెట్‌లో రాష్ట్రానికి ఏమేం కావాలో ఎప్పటి నుంచో అడుగుతున్నామని అన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరుతున్నామని అన్నారు. తెలంగాణ పట్ల ప్రధాని నరేంద్ర మోదీ చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. గతంలో తెలంగాణ పుట్టుకనే ఆయన అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్రం నుంచి ఏమీ అడగబోమని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అహంకారం ప్రదర్శించిందని, తాము మాత్రం సఖ్యత కోరుకుంటున్నామని అన్నారు. బడ్జెట్‌లో తమ ప్రతిపాదనలకు కేంద్రం అంగీకరించాల్సిందేనని స్పష్టం చేశారు. భారత ఫ్యూచర్ సిటీకి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నిలిచిపోయిన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలపాలని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Central Budget congress Latest News in Telugu Narendra Modi ponnam prabhakar Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.