📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

TG Assembly: సీఎం స్పీచ్‌ను వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Author Icon By sumalatha chinthakayala
Updated: March 15, 2025 • 3:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TG Assembly : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్‌ను వాకౌట్ చేసి బయటకు వచ్చారు. తమ నాయకుడు కేసీఆర్ చావు కోరుకునే విధంగా సీఎం మాట్లాడారని ఆరోపించారు. కేసీఆర్‌ను మార్చురీకి పంపిస్తాం అన్నారు.. అందుకే సీఎం స్పీచ్ ను బహిష్కరిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ సందర్భంగా లాబీలో హరీష్ రావు మాట్లాడుతూ.. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ చావును రేవంత్ రెడ్డి కోరుకున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం ప్రాణాలు ఫణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం తప్పు అని అన్నారు. అందుకే సీఎం స్పీచ్‌ను బహిష్కరించామని హరీష్ రావు తెలిపారు.

ప్రాజెక్టులు కట్టని కాంగ్రెస్ దే పాపం

మరోవైపు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని హరీష్ రావు పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులు కట్టలేదు కాబట్టి.. 299 టీఎంసీల నీరు తాత్కాలికంగా కేటాయించారని తెలిపారు. ప్రాజెక్టులు కట్టని కాంగ్రెస్ దే పాపం అని దుయ్యబట్టారు. రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ వెళ్లి ఎందుకు ఒప్పుకొని వచ్చారని ప్రశ్నించారు. పులిచింతల పోతిరెడ్డిపాడు కట్టినప్పుడు తాము కొట్లాడామని హరీష్ రావు పేర్కొన్నారు.

మాది త్యాగ చరిత్ర

ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనంగా ఉండి.. కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రి పదవి సాధించారని హరీష్ రావు తెలిపారు. ఈ మధ్య ఉత్తమ్ కుమార్ దంపతులు చంద్రబాబును కలిసి భోజనం చేసి వచ్చారు. ఆ తర్వాత శ్రీశైలం ఖాళీ చేసే లాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్రోహం చేశారని ఆరోపించారు. మాది త్యాగ చరిత్ర అయితే.. ఉత్తమ్ కుమార్‌ది ద్రోహ చరిత్ర అని తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ద్రోహం వల్లనే ఈ రోజు పంటలు ఎండుతున్నాయని హరీష్ రావు పేర్కొన్నారు.

Breaking News in Telugu BRS MLAs CM speech Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news walk out

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.