Breaking news: మూవీ పైరసీ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఐబొమ్మ రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా రవికి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇమంది రవి ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం విడిచి వెళ్లరాదని తన పాస్పోర్టును కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశించింది. ప్రతి రోజు సీసీఎస్ ఎదుట హాజరు కావాలని, ఈ మేరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Read Also: Municipal Elections: కాగజ్నగర్, జహీరాబాద్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశం
రవి ఇంటర్నెట్ వినియోగంపై కోర్టు పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించింది. ఆయన ఎలాంటి ఇంటర్నెట్ సౌకర్యాన్ని సొంతంగా వాడకూడదని, ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వాడాల్సి వస్తే కేవలం పోలీసుల ముందస్తు అనుమతితో మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది. దీనితో పాటు నిందితుడు దేశం విడిచి వెళ్లకుండా కట్టడి చేస్తూ, ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని ఆదేశించింది. భద్రతా చర్యల్లో భాగంగా రవి తన పాస్పోర్ట్ను వెంటనే కోర్టులో డిపాజిట్ చేయాలని న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: