టెక్నాలజీ-ఉన్నత విద్యపై ప్రారంభ సంచిక
హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నత విద్యను బలోపేతం చేయడానికి ఉన్నత విద్యా మండలి (Board of Education) ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా పరిశోధనల్లోనూ విద్యార్థులు ముందుండాలని భావించిన ఉన్నత విద్యా మండల ప్రత్యేకంగా తెలంగాణ జర్నల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TJH) ని ప్రారంభించింది.
6 నెలలకొక జర్నల్ను ప్రచురించడం
ప్రారంభ సంచికను చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి (Professor Balakishta Reddy) సోమవారం ప్రారంభించారు. జర్నలు వర్చువల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ విద్యావేత్తలు, పరిశోదకులు, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం, ప్రొఫెసర్ ఎస్కె మహమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ పాల్గొన్నారు. తెలంగాణలో పరిశోధనా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి అన్నారు. బలమైన పరిశోధన సంస్కృతిని పెంపొందించడానికి, విద్యా నైపుణ్యాన్ని నడిపించడానికి, ఉన్నత విద్యలో సాక్ష్యం ఆధారిత విధానాన్ని ప్రోత్సహించడానికి టిజెహెచ్ ఉపయోగపడుతుందన్నారు. ఉన్నత విద్యా మండలి 6 నెలలకొక జర్నల్ను ప్రచురించనున్నట్టు తెలిపారు. తెలంగాణ విద్యా భవిష్యత్తును రూపొందించడంలో సహాయ పడటానికి ఒక శక్తివంతమైన వేదికగా සි హెచ్ఐ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థలలో పరిశోధన కోసం జర్నల్ ఏర్పాటు ఒక బెంచ్మార్థ్కాగా ఉంటుందని బాల కిష్టారెడ్డి అన్నారు.
జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలను పెంచాలనే లక్ష్యంతో జర్నల్ను తీసుకొస్తున్నట్టు తెలిపారు. కొత్తగా వస్తున్న టెక్నాలజీ, ఆధుని కతలను విద్యార్థులకు పరిచయం చేయడం, ఏడాదికి రెండు జర్నల్స్ ను తీసుకు రావడంతో పాటు జాతీయస్థాయి సంస్థలతో అవ గాహన ఒప్పందాల (ఎంవోయు)ను చేసుకొని విద్యాసంస్థల సామర్థ్యంతోపాటు విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించుకోనున్నట్టు తెలిపారు.
Read also: Gachibowli: ఒక్క ప్లాట్ రూ.33 కోట్లు..