📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

BJP: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలిచి మోడీకి గిఫ్ట్ ఇస్తాం

Author Icon By Saritha
Updated: October 11, 2025 • 12:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు

హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తోందని బీజేపీ (BJP) తెలంగాణ (Telanagana) రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలంగాణ రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాంచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, అభయ్ పాటిల్, చంద్రశేఖర్ తివారీ, ఎంపీలు, ఎమ్మెల్సీలు, గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీల కమిటీల సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక, ప్రచార కార్యక్రమా లు, గెలుపు వ్యూహాలపై చర్చించారు.

Read also: భక్తుల ఇబ్బందులపై రియల్ టైం ఫీడ్ బ్యాక్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి ప్రధాని మోదీకి కానుక ఇవ్వాలని బీజేపీ శ్రేణులకు పిలుపు

అనంతరం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ లో తాము గెలుస్తామని పూర్తి నమ్మకం ఉందని, ప్రజలపై విశ్వాసం ఉందని ఉద్ఘాటించారు. విశ్వనగరం పేరుతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నగర ప్రజలను నిలువునా దోపిడీ చేస్తున్నాయని ఆక్షేపించారు. వర్షం వస్తే ప్రాణాలు పోయే పరిస్థితులు నగరంలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ జీన్స్ ఒక్కటేనని ఎద్దేవా చేశారు. శనివారం నుంచి బీజేపీ (BJP) శ్రేణులు ప్రతి ఒక్కరూ జూబ్లీహిల్స్ లో గ్రౌండ్ లేవల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మార్గనిర్దేశం చేశారు. బీసీలను బీఆర్ఎస్, కాంగ్రెస్ మోసం చేశాయని ధ్వజమెత్తారు. బీజేపీ వల్లే బీసీలకు న్యాయం జరుగుతోందని ప్రజలు కూడా ఈ నిర్ణయానికి వచ్చారని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తాము గెలుస్తామనే ఉద్ఘాటించారు. పూర్తి నమ్మకం ఉందని
ఎర్రగడ్డలో కాలనీల మధ్య ముస్లిం లకు శ్మశాన వాటికకు భూమి కేటాయిస్తున్నారని మండిపడ్డారు. ఒకవైపు జూబ్లీహిల్స్ పరిధిలో గుళ్లు కూలగొడుతున్నారని, హిందూ దేవాలయాలని రేవంత్ ప్రభుత్వం కూల్చేస్తోందని ఆరోపించారు. నగరంలో హిందు వులకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజుల్లో అభ్యర్థిని ఫైనల్ చేస్తామని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సీటు గెలిచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కానుకగా(గిఫ్ట్) బీజేపీ శ్రేణులు ఇవ్వాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

BC Reservations BJP Telangana BRS vs BJP Congress criticism Hyderabad News Jubilee Hills by-election K Kishan Reddy Ramchander Rao Revanth Reddy government Telangana politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.