Bike Robbery Medak: వివిధ ప్రాంతాల్లో బైకులు దొంగలించిన ఇద్దరు వ్యక్తులలో ఒకరు కురుమ రాజశేఖర్ ను అరెస్టు చేసి నాలుగు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు మరో వ్యక్తి దుండగుల అశోక్ పరారీలో ఉన్నట్లు అల్లాదుర్గం సిఐ రేణుక రెడ్డి(CI Renuka Reddy) తెలిపారు. శుక్రవారం పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం కొమలంచ గ్రామానికి చెందిన కురుమ రాజశేఖర్ అతని సహచరుడు దుండగులు అశోక్ తో కలసి గతంలో ద్విచక్ర వాహనాలను దొంగలించారని తెలిపారు.
Read Also:Fire Accident: ఫిలీప్పిన్స్లో భారీ అగ్నిప్రమాదం.. 1,000 ఇళ్లు దగ్ధం?
4 బైకులు స్వాధీనం.. పరారీలో మరో వ్యక్తి
మీరిద్దరికి జైలులో పరిచయం ఏర్పడినట్లు వివరించారు. ఈ క్రమంలో గురువారం ఉదయం తెల్లవారుజామున ఒంటిగంటకు బైకులు దొంగలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు కురుమ రాజశేఖర్ ను అరెస్టు చేశారు. అనంతరం రాజశేఖర్ ను విచారించగా అతని సహచరుడు దుండగుల అశోక్ తో కలిసి గతంలో పెద్ద శంకరంపేట, మెదక్ టౌన్ ,నిజాంసాగర్, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో ఇద్దరు కలిసి బైకులు దొంగలించినట్లు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. మరో వ్యక్తి దుండగుల అశోక్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సిఐ తెలిపారు. వీరిద్దరూ కలిసి గతంలో చాలా చోట్ల దొంగతనాలు చేసి జైలు కు వెళ్లి వచ్చినట్లు పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాల రికవరీ కేసును విజయవంతంగా చేదించిన ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి కానిస్టేబుళ్లు వినోద్, రామ్ సింగ్ ను ఈ సందర్భంగా సిఐ రేణుక రెడ్డి అభినందించారు. కురుమ రాజశేఖర్ ను రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: