📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

బిగ్ అప్డేట్.

Author Icon By Anusha
Updated: February 10, 2025 • 12:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒకటొకటిగా అమలుపరుస్తూ వస్తోంది. సంక్షేమ పథకాల అమలులో అధికారులకు సూచనలు చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ విషయంలో తాజాగా అధికారులకు కీలక సూచనలు అందాయి. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి లబ్దిదారుల జాబితాను సిద్దం చేసారు. ఇక, ఈ గ్రామాల్లో ఇళ్ల గ్రౌండింగ్ కోసం ఏర్పాటు ప్రారంభించారు. ముందుగా ఆ గ్రామాల్లో ప్రీ గ్రౌండింగ్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారలు కోసం ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రీ గ్రౌండింగ్ సమావేశాల నిర్వహణ దిశగా కసరత్తు చేస్తోంది. ఎంపికైన లబ్దిదారుల ఇళ్ల నిర్మాణం లో అనుసరిం చనాల్సిన విధానాలు.. నిర్మాణ సామాగ్రి.. ఎలా నిర్మాణం చేపట్టాలనే వాటితో పాటుగా వారి సందే హాలకు పరిష్కారం చూపేలా ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే లబ్ది దారులకు పథకం అమలుకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేసింది. అందులో భాగంగా ఇందిరమ్మ యాప్‌ సర్వే సమయంలో సొంత స్థలం చూపిన ప్రాంతంలో లబ్ధిదారుడే ముగ్గు పోసుకోవాల్సి ఉంటుంది. లబ్ధిదారుడు మరోచోట ఇల్లు కట్టుకుంటానంటే ఆ ఇంటిని అధికారులు రద్దు చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

తమ స్థలంలో లబ్దిదారుడు ముగ్గు పోసుకొని సిద్దమైన తరువాత సమాచారం ఇస్తే గ్రామ కార్యదర్శి అక్కడకు వచ్చి వారిని ఫొటోలు తీసుకొని ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేస్తారు. నిర్మాణ ప్రదేశాన్ని జియో ట్యాగింగ్‌ చేసి ఇస్తారు. అదే విధంగా ప్రతీ లబ్దిదారుడు కనీసం 400 చదరపు అడుగులు కంటే తక్కువ కాకుండా ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసారు. పునా ది పూర్తయిన తర్వాతే మొదటి విడతలో రూ.లక్షను లబ్ధిదారుడి ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. ప్రతి ఇంటికి 8 ట్రాక్టర్ల ఇసుకను అందించాలని నిర్ణయించగా, దీనికి సంబంధించి కూపన్లను తహసీల్దార్‌ లేదా ఆర్డీవో ద్వారా అందించాలని స్పష్టం చేసారు.మొదటి విడతలో 71,482 ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించింది. 21 నియోజకవర్గాల్లో 1000కి పైగా ఇళ్లను ఇవ్వనుంది. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో 2,528 ఇళ్లు , మంథని 1,952, బోథ్‌ 1,538, పరకాల 1,501 ఇళ్ల పంపిణీకి నిర్ణయించారు. ఆ తరువాత వరుసగా హుస్నాబాద్‌, సిర్పూర్‌, దుబ్బాక, పరిగి, బెల్లంపల్లి, జహీరాబాద్‌ వంటి నియోజకవర్గాల ల్లో ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించారు. మిగిలిన నియోజకవర్గాల్లో వెయ్యి వరకు ఇళ్లను ఇచ్చేందుకు ఎంపిక చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై కసరత్తు కొనసాగుతున్న వేళ పథకాల అమలు విషయంలో కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి.

#BreakingNews #GovernmentUpdate #HousingScheme #IndirammaHouses #telangana #TeluguNews Breaking News in Telugu congress Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.