Bhatti : ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్ బిల్లులు విడుదల

Read Time:  1 min
Bhatti
Bhatti
FONT SIZE
GET APP

రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. పెండింగ్ బిల్లుల పరిష్కారంలో భాగంగా డిసెంబర్ నెలకు సంబంధించిన రూ.713 కోట్లను బుధవారం విడుదల చేసింది. గతంలో ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెలా సగటున రూ.700 కోట్లను విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

Read Also: Drunk and Drive: ఒక్క చుక్క కూడా ప్రమాదకరమే!

Bhatti
Bhatti

ఈ హామీ అమలులో భాగంగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti ) ఆర్థిక శాఖ అధికారులకు డిసెంబర్ నిధులు వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, సరెండర్ లీవులు, జీపీఎఫ్‌, అడ్వాన్స్‌లకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లోనే ఉండిపోయాయి. వీటి మొత్తం విలువ సుమారు రూ.10 వేల కోట్లకు చేరినట్లు అంచనా.

ఈ పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు జూన్ నెలలో(Bhatti ) ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమయ్యాయి. దీనికి స్పందించిన ప్రభుత్వం ప్రతినెలా రూ.700 కోట్ల చొప్పున విడుదల చేస్తామని ప్రకటించింది. తొలిసారిగా జూన్ చివరలో రూ.183 కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం, ఆ తర్వాత ఆగస్టు నుంచి ప్రతి నెలా రూ.700 కోట్ల మేర నిధులు విడుదల చేస్తూ వస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Radha

రచయిత గురించి

Radha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.