పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) స్పిల్వే సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెక్కులకు పెంచడం వల్ల తెలంగాణకు తీవ్రమైన బ్యాక్ వాటర్ సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
(MLC Kavitha)అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ మార్పులు జరిగితే గోదావరి నదిపై ఉన్న భద్రాచలం రామాలయం (Bhadrachalam Temple) ముంపు ప్రమాదంలో పడతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
సుప్రీం కోర్టు వరకు వెళ్లిన తెలంగాణ జాగృతి
పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని పలు ప్రాంతాలు మునిగే అవకాశం ఉందని ఇప్పటికే ఎన్నోసారి హెచ్చరించామని కవిత గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ జాగృతి ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని, సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి ఆమె ప్రస్తావించారు. ఇప్పుడైనా కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణం స్పందించి పోలవరం ముంపు ప్రాంతాలపై సంయుక్త సర్వే నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు.
భద్రాచలం రక్షణకు ప్రత్యామ్నాయాలు కావాలి
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్చా వేదికలో పలు విభిన్న వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. భద్రాచల దేవాలయం మునిగిపోవడం కేవలం శైవ వైష్ణవ సంప్రదాయాలకే కాదు, కోటి మంది భక్తుల మనోభావాలకు తాకిడి అవుతుందని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు నిర్మాణంలో మార్పులు చేయకుండా ముందుకెళితే, భద్రాచల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. తదుపరి చర్యలపై ప్రభుత్వాలు చొరవ చూపి పరిష్కార మార్గాలు సిద్ధం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Read Also : Air India : అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎయిరిండియా బుకింగ్లపై తీవ్ర ప్రభావం