భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో మానవత్వం మరిచిన తండ్రి అకృత్యం వెలుగులోకి వచ్చింది. కన్న తండ్రే తన కూతురిని పదే పదే కాలుతో తన్నుతూ శారీరకంగా, మానసికంగా హింసించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.ఐటీసీ (ITC) లో పనిచేస్తున్న వ్యక్తి తన మైనర్ బాలికను ఇంట్లోని చిన్న కారణాలకే కోపంతో తన్నడం ప్రారంభించాడు. తండ్రి ఈ చర్యలతో బాలిక భయభ్రాంతులకు లోనైంది. తండ్రి తీరుతో ఆ బాలిక తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. ఈ విషయాన్ని గమనించిన తల్లి చైల్డ్ హెల్ప్లైన్ 1098కి ఫిర్యాదు చేయడం ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.తల్లి ఫిర్యాదు మేరకు స్పందించిన ఐసీడీఎస్ (ICDS) అధికారులు వెంటనే స్పందించి సూపర్వైజర్ సక్కుబాయి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. బాలిక పరిస్థితిని పరిశీలించిన అధికారులు, తండ్రి చర్యలు మానవత్వ విరుద్ధమని గుర్తించారు. తదుపరి చర్యలతో సారపాక పోలీస్ స్టేషన్లో తండ్రిపై కేసు నమోదు చేయించారు.
పిల్లలు ఎంతో భరోసాతో ఎదగాల్సిన వయసులో
బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు వాస్తవంగా సాధికారతకు దోహదపడతాయా? అనే ప్రశ్నను ఈ ఘటన మళ్లీ ముందుకు తెస్తోంది. మైనర్ బాలికలపై శారీరక హింస, మానసిక ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో సామాజిక అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉంది.ఇలాంటి ఘటనలు మానవ సంబంధాల్లోని నమ్మకాన్ని దిగజార్చేలా ఉంటాయి. కుటుంబంలో ఉండే పిల్లలు ఎంతో భరోసాతో ఎదగాల్సిన వయసులో భయంతో బతకడం శోచనీయం. తల్లిదండ్రులు (Parents) తమ కోపాన్ని పిల్లలపై చూపకూడదని, అటువంటి వాతావరణం వారిపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎందుకు ప్రసిద్ధి?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధానంగా గనుల పరిశ్రమ కోసం ప్రసిద్ధి.ఈ జిల్లాలో (SCCL) అనే గనుల సంస్థ ప్రధాన కార్యాలయం కొత్తగూడెంలో ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా ఏది?
తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అతిపెద్ద జిల్లా.ఈ జిల్లావైశాల్యం సుమారు 7,483 చ.కిమీ (చదరపు కిలోమీటర్లు)గా ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: CM Revanth : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్