हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Thieves : జాగ్రత్త.. వృద్ధ మహిళను టార్గెట్‌గా‌ పెట్టుకున్న దొంగలు

Sudheer
Thieves : జాగ్రత్త.. వృద్ధ మహిళను టార్గెట్‌గా‌ పెట్టుకున్న దొంగలు

ఇళ్లలో ఒంటరిగా ఉండే వృద్ధ మహిళలను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న దొంగను బేగంపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.8 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, మోటార్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బేగంపేట పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్, ఏసీపీ గోపాలకృష్ణ మూర్తి, ఇన్‌స్పెక్టర్ ప్రసాదరావు, డీఐ మధు వివరాలను వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేసు ఆధారంగా ఇతర దొంగతనాలపై కూడా నిందితుడి సంబంధాలను విచారిస్తున్నారు.

హైదరాబాద్‌లో వృద్ధ మహిళలు టార్గెట్ చేస్తున్న దొంగలు

నిందితుడు తిరుపతికి చెందిన పాపాని క్రాంతికుమార్ (32) కాగా, మొదట చిన్న వ్యాపారాలు చేస్తూ జీవనం సాగించేవాడు. అయితే జల్సాలు, జూదాలకు బానిసై డబ్బులు సంపాదించేందుకు తక్కువ మార్గాన్ని ఎంచుకున్నాడు. దాంతో తిరుపతి, హైదరాబాద్‌ ప్రాంతాల్లో వృద్ధ మహిళలు ఒంటరిగా ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని, చోరీలకు పాల్పడుతున్నాడు. హోండా సీబీ షైన్‌ బైక్‌పై వేర్వేరు కాలనీలు, బస్తీలు తిరుగుతూ తలుపులు తెరిచిన ఇళ్లలోకి చొరబడి మెడలో ఉన్న బంగారు గొలుసులను అపహరిస్తూ వచ్చాడు. గతంలో కూడా పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపినప్పటికీ, తిరిగి అదే మార్గంలో కొనసాగాడు.

మయూరి మార్గ్‌లో భారీ చోరీ

ఇటీవల మయూరి మార్గ్‌లో జరిగిన చోరీ ఘటనలో నిద్రిస్తున్న వృద్ధ మహిళ కమల మెడలోని గొలుసు తిప్పి తీసుకెళ్లిన నిందితుడు, బాధితురాలి ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాల సాయంతో గుర్తించబడ్డాడు. వెంటనే రంగంలోకి దిగిన బేగంపేట పోలీసులు అతన్ని పట్టుకొని అరెస్టు చేసి, అతని నుంచి రూ.8 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, చోరీ చేసిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, తమ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల గురించి వెంటనే సమాచారం అందించాలని సూచిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870