గద్వాల జిల్లాలో పెద్దధన్వాడ మండలంలో ఏర్పాటవుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీ(Ethanol Factory)కి వ్యతిరేకంగా రైతులు బహిరంగంగా నిరసన వ్యక్తం చేశారు. తమ భూములు కోల్పోతామని భయపడుతున్న రైతులు, ప్రాజెక్ట్ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో భాగంగా పలువురు రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కోర్టు ముందు అన్నదాతలకు సంకెళ్లు.. తీవ్ర విమర్శలు
అరెస్ట్ చేసిన రైతులను అలంపూర్ కోర్టుకు తీసుకెళ్లే సమయంలో పోలీసులు వారికి బేడీలు వేసారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. “అన్నదాతలకు సంకెళ్లు వేయడమేనా న్యాయం?” అంటూ ప్రజలు, విపక్షాలు పోలీస్ వ్యవహారాన్ని తీవ్రంగా విమర్శించాయి. సంఘటిత సంఘాలు, రైతు సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం చేశాయి.
సస్పెన్షన్ వేటు.. చర్యలపై సీఎం అప్రమత్తం
ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ఒక ఆర్ఎస్సైతో పాటు ఇద్దరు ఏఆర్ఎస్సైలను సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రజాస్వామ్యంలో రైతుల అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని, శాంతియుతంగా నిరసన తెలిపిన రైతులకు ఈ విధంగా అవమానం చేయడాన్ని ప్రభుత్వం సహించబోమని స్పష్టం చేసింది.
Read Also : Yogandhra-2025 : ట్రాఫిక్ ఉచ్చులో విశాఖ