చట్టబద్ధమైన రిజర్వేషన్ల డిమాండ్
హైదరాబాద్ : రాష్ట్రంలో బిసిలకు(BC Reservations) చట్టబద్ధమైన రిజర్వేషన్లు కావాలని.. పార్టీపరమైన రిజర్వేషన్ వద్దని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్(Jajula Srinivas Goud)డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీపరంగా బిసిలకు 42 శాతం కేటాయిస్తామంటే ఊరుకునేది లేదని.. పార్టీపరంగా టికెట్లు ఇచ్చే దానికి అయితే 20 నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు ఆపినట్టని ప్రశ్నించారు. శనివారం జరిగే క్యాబినెట్ సమావేశంలో చట్ట బద్ధంగా బిసిలకు రిజర్వేషన్ కల్పించడానికి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం, క్యాబినెట్పై డిమాండ్లు
క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రి మండలి మొత్తం రాష్ట్ర గవర్నర్ని కలిసి బిసి రిజర్వేషన్లపై వత్తిడి పెంచాలని.. మంత్రివర్గ ఉప సంఘం కాంగ్రెస్ పార్టీ పీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం బిసిలకు న్యాయం జరిగే విధంగా ఉండాలని.. గత ప్రభుత్వంలో తీసుకువచ్చిన పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించడానికి అసెంబ్లీ సమావేశాల్లో బిసి రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేయాలన్నారు. బిసి రిజర్వేషన్లపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష పార్టీలు, బిసి సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
రాజకీయ మరియు న్యాయపోరాటం అవసరం
బిసి రిజర్వేషన్లపై(BC Reservations) రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు న్యాయపోరాటం.. మరొకవైపు రాజకీయ పోరాటం చేయాలని శ్రీనివాస్ గౌడ్ సూచించారు. బిసి రిజర్వేషన్లు పెంపుపై చట్టబద్ధంగా సాధ్యం కాకపోతే.. చివరి అవకాశంగా మాత్రమే పార్టీపరంగా బిసిలకు టికెట్లు కేటాయింపుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలన్నారు. బిసి రిజర్వేషన్లు పెంచకపోతే బిసి కులగణనకు అర్థం లేదన్నారు. దేశంలో రోల్ మోడల్ అని చెప్పి .. ఇప్పుడు తీరా పార్టీ పరంగా టికెట్లు ఇస్తామంటే, ఇది ఓల్డ్ మోడల్ అవుతుందన్నారు.
బీహార్ ఉదాహరణ మరియు కాంగ్రెస్ భవిష్యత్
బీహార్ లో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావాలంటే .. తెలంగాణలో బిసి రిజర్వేషన్లను పెంచి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తేనే బీహార్లో బిసిలు కాంగ్రెస్ను విశ్వసిస్తారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బిజెపి బిసిలకు చేస్తున్న మోసంపై దేశవ్యాప్తంగా పోరాడడానికి కాంగ్రెస్ పార్టీ బిసిలతో కలిసి రావాలన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం
నేటి జరిగనున్న అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ సమయాన్ని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేయాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
జాజుల శ్రీనివాస్ గౌడ్ ఏమి డిమాండ్ చేశారు?
బిసిలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు ఇవ్వాలని, పార్టీపరమైన రిజర్వేషన్లు వద్దని డిమాండ్ చేశారు.
క్యాబినెట్ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోవాలని కోరారు?
బిసిలకు చట్టబద్ధమైన రిజర్వేషన్ కల్పించడానికి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
బిసి రిజర్వేషన్లపై ఆయన సూచించిన పోరాటం ఏమిటి?
ఒకవైపు న్యాయపోరాటం, మరొకవైపు రాజకీయ పోరాటం చేయాలని సూచించారు.
బీహార్ కాంగ్రెస్పై ఏ వ్యాఖ్య చేశారు?
తెలంగాణలో బిసి రిజర్వేషన్లు పెంచి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తేనే బీహార్లో బిసిలు కాంగ్రెస్ను విశ్వసిస్తారని అన్నారు.
Read hindi news: Hindi.vaartha.com
Read also: