हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telugu News:BC Reservation: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడతాం – ఎంపీ ఆర్. కృష్ణయ్య

Pooja
Telugu News:BC Reservation: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడతాం – ఎంపీ ఆర్. కృష్ణయ్య

తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల(BC Reservation) అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య తీవ్రంగా ఖండించారు. విద్యా, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడతామని ఆయన హెచ్చరించారు.

Read Also: AP Crime: హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై కత్తులతో దాడి

BC Reservation
BC Reservation

నిరసన ప్రదర్శన, ప్రభుత్వ వైఫల్యంపై విమర్శలు

శుక్రవారం గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద బీసీ(BC Reservation) జేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు, యువజన, బీసీ కుల సంఘాల ప్రతినిధులతో కలిసి ఆర్. కృష్ణయ్య(R.Krishnaiah) నిరసన ప్రదర్శన మరియు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 42 శాతం రిజర్వేషన్లపై ప్రతి దశలోనూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందన్నారు. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో జీఓ 46ను తీసుకొచ్చి ప్రభుత్వం బీసీలను దగా చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక

బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు తాము దశలవారీగా పోరాటం చేస్తామని ఆర్. కృష్ణయ్య ప్రకటించారు:

  • ప్రధాని మోదీతో భేటీ: రానున్న పార్లమెంటు సమావేశాల్లో 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేలా త్వరలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విన్నవిస్తామని తెలిపారు.
  • భారీ బహిరంగ సభ: బీసీ రిజర్వేషన్లపై త్వరలో పరేడ్‌మైదానంలో లక్షలాది మందితో కలిసి భారీ బహిరంగ సభను నిర్వహించి కాంగ్రెస్ సర్కారును ఎండగడతామని చెప్పారు.
  • జంతర్ మంతర్ ధర్నా: అప్పటికీ ప్రభుత్వం స్పందించని పక్షంలో, ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ సహా పలువురు బీసీ రాష్ట్ర ప్రతినిధులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870