BC Commission : రాష్ట్రంలో వేగంగా వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల సమాచారాన్ని కులాల వారిగా సేకరించాలని సంబంధిత శాఖల ఉన్నతాధికారులను బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆదేశించారు. ఈ అంశంపై కమిషన్ కార్యాలయంలో బుధవారం బీసీ కమిషన్ ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించింది. రాష్ట్రంలోని విద్యార్థుల వివరాలను సేకరించడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోదని ఛైర్మన్ అన్నారు.
Read Also: Medak Municipal Election: కాంగ్రెస్ కు ఓటు వేస్తే కష్టాల పాలవుతాం:పద్మాదేవేందర్ రెడ్డి
సమాచారాన్ని సేకరించి కార్యక్రమానికి శ్రీకారం
ఈ అంశం ప్రాధాన్యతను గుర్తించి వేగంగా సమాచారం సేకరించి, కమిషన్కు అందించాలని ఆదేశించారు. ఈ సమాచారం ఆధారంగా బీసీ విద్యార్థుల్లో ఏ కులానికి, ఏ వర్గానికి చెందినవారు విద్యకు దూరంగా ఉంటున్నారో గుర్తించి, వారిని ప్రోత్సహించే అవకాశం కలుగుతుందన్నారు. ఈ సమావేశానికి హాజరైన అధికారులందరు వెంటనే ఈ సమాచారాన్ని సేకరించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నారు. కాగా.. ఈ ఏడాది మార్చిలోపు వివరాలు అందిస్తామని విద్యాశాఖ(Higher Education) తోపాటు వివిధ శాఖల అధికారులు చెప్పారన్నారు.
కాగా.. ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్ మాట్లాడుతూ రాబోయే విద్యా సంవత్సరం నుండి జరిగే ప్రవేశ పరీక్షల్లోనూ కుల సంబంధిత సమచారాన్ని కూడా సేకరించబోతున్నట్లుగా తెలిపారు. ఈ సమావేశంలో బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి, సభ్య కార్యదర్శి బాల మాయాదేవితోపాటు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్, కాళోజి నారాయణరావు యూనివర్సిటి ఆఫ్ హెల్త్ సైన్సెస్ రిజిస్ట్రార్ కె. నాగార్జునరెడ్డి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రెటరి శ్రీకృష్ణ ఆదిత్య హాజరయ్యారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: