हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telugu News: B.V. Raghavulu: విద్యుత్ చట్ట సవరణతో ఉచిత విద్యుత్ రద్దయ్యే ప్రమాదం

Sushmitha
Telugu News: B.V. Raghavulu: విద్యుత్ చట్ట సవరణతో ఉచిత విద్యుత్ రద్దయ్యే ప్రమాదం

హైదరాబాద్: తెలంగాణ(Telangana) అసెంబ్లీలో బీసీలకు(BC) 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు మద్దతిచ్చి, కేంద్రంలో మాత్రం ఆమోదించకుండా బీజేపీ అడ్డుకుంటుందని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. బీజేపీ బీసీల పట్ల మోసపూరితంగా, రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. బుధవారం ఎంబీ భవన్‌లో జరిగిన సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Read Also: Rain Alert: మరో 3 రోజులు భారీ వర్షాలు

B.V. Raghavulu

రాజ్యాంగ సవరణకు డిమాండ్, విద్యుత్ చట్ట సవరణపై ఆందోళన

కోర్టు విధించిన 50 శాతం రిజర్వేషన్ల(Reservations) పరిమితిని ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేస్తే బీసీలకు స్థానిక సంస్థలతో పాటు అన్ని రకాలుగా 42 శాతం రిజర్వేషన్ అమలవుతుందని పేర్కొన్నారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర బంద్‌లో బీజేపీ పాల్గొనడం దాని మోసపూరిత వైఖరికి నిదర్శనమన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే గవర్నరుకు చెప్పి బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేయాలని డిమాండ్ చేశారు.

విద్యుత్ చట్ట సవరణతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవరణ అమల్లోకి వస్తే వ్యవసాయానికి ఉచిత విద్యుత్, గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు రద్దవుతాయని, డిస్కంలు ప్రైవేటుపరం అవుతాయని విమర్శించారు. ఈ సంస్కరణలన్నీ ప్రజల కోసం కాదని, ఆదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు లాభం చేకూర్చడం కోసమేనని ఆయన అన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక

మరో పొలిట్ బ్యూరో సభ్యులు విజయరాఘవన్ మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను అమలు చేస్తోందని విమర్శించారు. మత విద్వేషాలను రెచ్చగొడుతోందని, జ్ఞానవాపి, మధుర వంటి విషయాలను వివాదాస్పదం చేస్తోందని అన్నారు. బీహార్‌లో ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు ఓడిస్తారని, అక్కడ బీజేపీ కూటమిని ఓడించడమే తమ లక్ష్యమని, అందుకే తాము మహాకూటమిలో ఉన్నామని వివరించారు.

సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో(Jubilee Hills by-election) బీజేపీని ఓడించడమే తమ కర్తవ్యమని, అందుకే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చినా, ప్రజా సమస్యలపై పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. రైతుల ఆమోదం ఉంటేనే ఆర్‌ఆర్‌ఆర్ కోసం భూసేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

బీసీ రిజర్వేషన్ల బిల్లుపై సీపీఎం చేసిన ప్రధాన విమర్శ ఏమిటి?

అసెంబ్లీలో మద్దతిచ్చి, కేంద్రంలో బిల్లును అడ్డుకుంటుందని, ఇది బీజేపీ రెండు నాల్కల ధోరణి అని విమర్శించారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీపీఎం ఎవరికి మద్దతు ఇచ్చింది?

బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870