తెలంగాణ కేబినెట్ విస్తరణలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్కు మంత్రి పదవి లభించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. అక్టోబర్ 31న ఆయన మంత్రి పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కేబినెట్లో మైనార్టీ ప్రతినిధ్యం లేకపోవడం ప్రధాన విమర్శగా మారింది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ను కేబినెట్లో చేర్చడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి మైనార్టీ వర్గాలను సంతృప్తిపరచాలని చూస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Latest News: Cyber Fraud: దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసం బహిర్గతం!
అజారుద్దీన్కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ హైకమాండ్ ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం వారి అభ్యర్థనను గవర్నర్కు ఇప్పటికే పంపించగా, ఆమోదం వచ్చిన వెంటనే ఆయన ప్రమాణ స్వీకారం పూర్తి కానుంది. అజారుద్దీన్కు ఏ శాఖ అప్పగించబడుతుందన్న ఆసక్తికర చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. ముఖ్యంగా హోం శాఖ ఇప్పటి వరకూ సీఎం రేవంత్ వద్ద ఉండటం, లేదా మైనారిటీ సంక్షేమ శాఖ కూడా కీలకమైనదే కావడంతో, ఈ రెండు శాఖల్లో ఏదైనా అజారుద్దీన్కు ఇవ్వొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. కేబినెట్లోకి ఆయన రాకతో హైదరాబాద్, మైనార్టీలకు సంబంధించిన నిర్ణయాలు మరింత వేగవంతం కానున్నాయని భావిస్తున్నారు.

జూబ్లిహిల్స్ అసెంబ్లీ స్థానంలో ఉపఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం పూర్తిగా రాజకీయ వ్యూహమేనని పలువురు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసిన అజారుద్దీన్ పరాజయం పాలయ్యారు. ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇచ్చి, ఉపఎన్నికలో మైనార్టీ ఓటు బ్యాంకును పటిష్ఠం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అతనికి మంత్రి పదవి లభించడం కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ పటిష్ఠంలో సాధికారత పెంచి, రాబోయే ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/