📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

ప్రస్తుతం యువత ఐటీ ఉద్యోగాలవైపే మొగ్గు : సీఎం

Author Icon By sumalatha chinthakayala
Updated: February 28, 2025 • 5:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశ రక్షణ కోసం అవసరమైన ఇంజినీర్లను తయారుచేయడం మరింత ముఖ్యం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కలిసి గచ్చిబౌలి స్టేడియంలో డీఆర్‌డీవో ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విజ్ఞాన్ వైభవ్‌’ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..దేశ రక్షణ బాధ్యత యువతపైనే ఉందని అన్నారు. దేశ రక్షణలో తెలంగాణ పాత్ర కీలకంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి ఏటా లక్షకుపైగా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ చదివి, అమెరికాకు వెళ్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వారిలో దేశభక్తితో, దేశ రక్షణ ప్రాధాన్యతనలు వివరించడానికి ఈ వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నామని అన్నారు.

బీడీఎల్‌, హెచ్‌ఏఎల్‌, మిధాని వంటి కీలక సంస్థలు

తెలంగాణ నుంచి కేవలం ఐటీ ప్రొఫెషనల్స్ మాత్రమే అమెరికాకు వెళ్లకుండా, దేశ రక్షణ రంగానికి అవసరమైన సమర్థవంతమైన ఇంజినీర్లు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీడీఎల్‌, హెచ్‌ఏఎల్‌, మిధాని వంటి కీలక సంస్థలు హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సైన్స్‌ ప్రదర్శన వల్ల విద్యార్థులు, యువతకు దేశరక్షణ పట్ల అవగాహన కలుగుతుందన్నారు. దేశ రక్షణ కోసం అవసరమైన ఇంజినీర్లను తయారుచేయడం మరింత ముఖ్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

రక్షణ రంగంలో భారతదేశాన్ని నంబర్

ప్రస్తుతం యువత ఐటీ ఉద్యోగాలవైపే మొగ్గు చూపుతోందని.. సంప్రదాయ ఇంజినీరింగ్‌ విద్యపై కూడా విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సీఎం సూచించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి ఏటా లక్షకుపైగా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ చదివి, అమెరికాకు వెళ్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వారిలో దేశభక్తితో, దేశ రక్షణ ప్రాధాన్యతనలు వివరించడానికి ఈ వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నామని అన్నారు. రక్షణ రంగంలో భారతదేశాన్ని నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లేందుకు తాము ప్రయత్నిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Breaking News in Telugu CM Revanth Reddy Google news Google News in Telugu it jobs Latest News in Telugu Telugu News online Youth

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.