ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన చమురు సంక్షోభం, ఇప్పుడు భారతీయ హోటల్ పరిశ్రమను ఊపిరి సలపనివ్వని స్థితికి నెట్టింది. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా ఇరాన్ ముడి చమురు సరఫరాను అడ్డుకోవడంతో, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరగడమే కాకుండా గ్యాస్ సరఫరా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. దీని ప్రభావంతో భారత్లో ఎల్పీజీ (LPG), సీఎన్జీ (CNG) ధరలు అమాంతం పెరిగాయి. మరీ ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రం కావడంతో బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాల్లో ఇప్పటికే అనేక హోటళ్లు మూతపడ్డాయి. విశాఖపట్నంలో సైతం హోటళ్ల మూసివేత ప్రతిపాదనలు తెరపైకి రావడం, ఈ సంక్షోభం ఎంతటి తీవ్రతకు దారితీసిందో స్పష్టం చేస్తోంది.
Read Also : Gold rate 10/03/26 : గోల్డ్ రేట్లు తగ్గుదల, ఈరోజు 24K, 22K ధరలు ఇవే
హైదరాబాద్లోనూ ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, గత వారం రోజులుగా గ్యాస్ సరఫరా నిలిచిపోవడమే కాకుండా, అందుబాటులో ఉన్న సిలిండర్ల ధరలు భరించలేనంతగా పెరిగాయి. హోటల్ రంగానికి గ్యాస్ అనేది ఆక్సిజన్ వంటిదని, అది లేకపోతే వంటకాలు వండటం అసాధ్యమని అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డిస్ట్రిబ్యూటర్ల నుంచి సానుకూల స్పందన లేకపోవడం, ప్రభుత్వాల నుంచి స్పష్టమైన హామీ అందకపోవడంతో ఈ పరిశ్రమపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడింది. ప్రస్తుతానికి హైదరాబాద్లో హోటళ్ల బంద్పై అధికారిక నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జోక్యం చేసుకుని గ్యాస్ నిల్వల కొరతను తీర్చకపోతే హోటల్ పరిశ్రమ కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :