📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు

Author Icon By sumalatha chinthakayala
Updated: December 16, 2024 • 10:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: ఈ నెల 9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ, సోమవారం వరకు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాలను వారం రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. సోమవారం ఉదయం సమావేశాలు పునఃప్రారంభమైన తర్వాత తొలుత సభ్యుల మౌఖిక ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. అనంతరం బీఏసీ (బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ) సమావేశం కానున్నది. సభను ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే బిల్లులు ప్రవేశపెట్టాలి? వంటి అంశాలపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సభ సమావేశాలను వారంపాటు నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం.

ఈ రోజు ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాల అనంతరం పలు సంతాప తీర్మానాలను ప్రవేశపెడతారు. ఆ తర్వాత, తెలంగాణ యువ భారత వ్యాయామ విద్య, క్రీడా విశ్వవిద్యాలయం బిల్లు, తెలంగాణ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలో పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చను చేపడతారు. శాసనమండలిలో కూడా ఇదే అంశంపై చర్చ జరగనుంది. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ వ్యవహారాలు సహా పలు శాఖల బిల్లులు సభకు వచ్చే అవకాశాలున్నట్టు తెలిసింది.

కాగా, గత సోమవారం సమావేశాల ప్రారంభం రోజే తెలంగాణతల్లి నూతన విగ్రహం, రూపురేఖలు వంటి అంశాలపై సభలో చర్చించారు. అయితే, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ సభ్యులను ఉభయసభల్లోకి ఉద్దేశపూర్వకంగానే రాకుండా చేసి, ప్రభుత్వం చర్చ పెట్టిందనే విమర్శలు వినిపించాయి. తెలంగాణ ప్రజలు ఆరాధించిన తల్లిని కాదని, అభయహస్తం తల్లిని ఉద్దేశపూర్వకంగా రుద్దాలనే కుట్రను ప్రభుత్వం చేసిందని, ఆ బండారం అంతా తాము బయటపెడతామనే భయంతోనే తమను ముందస్తుగానే సభకు రాకుండా అరెస్టు చేయించిందని బీఆర్‌ఎస్‌ ఆరోపించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొన్నది.

sports university bill telangana assembly session Telangana Govt

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.