📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Asaduddin Owaisi : జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడి ఘటన పై స్పందించిన అసదుద్దీన్

Author Icon By sumalatha chinthakayala
Updated: April 23, 2025 • 7:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Asaduddin Owaisi : జమ్మూకశ్మీర్‌ లో జరిగిన ఉగ్రమూకల దాడిని ఎమ్ఐఎమ్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. ఆర్మీ దుస్తుల్లో వచ్చి అమాయకులను చంపడం దుర్మార్గమైన చర్య అన్నారు. టూరిస్టులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కేంద్రానికి సూచించారు. కాగా, మంగళవారం అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాంలో పర్యటిస్తున్న పలువురు పర్యటకులపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు.

పర్యటకులపై ఉగ్రవాదులు దాడికి పాల్పడటం ఆందోళన

మినీ స్విట్జర్లాండ్‌గా పేర్కొనే పహల్గాంలోని బైసరన్‌ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని అటాక్ చేశారు. కాల్పుల శబ్దం వినిపించడంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు టూరిస్టులను అక్కడినుంచి తరలించారు. గాయపడిన వారిని హెలికాప్టర్‌ ద్వారా ఆస్పత్రికి తరలించారు. అమర్‌నాథ్‌ యాత్ర జులై 3 నుంచి ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా లక్షల మంది యాత్రికులు ఈ మార్గంలో వస్తుంటారు. ఈ నేపథ్యంలో పర్యటకులపై ఉగ్రవాదులు దాడికి పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది.

ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ఎన్ఐఏ

ఈ ఘటనలో ఇప్పటివరకు 27 మంది టూరిస్ట్‌లు మరణించగా.. మరో 20 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో జమ్మూ కాశ్మీర్‌లో అతిపెద్ద ఉగ్రదాడి అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఇక ఈ పహల్గామ్ ఉగ్రదాడిని ప్రధాని మోడీ తీవ్రంగా పరిగణించి ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చారు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచే ఆరా తీస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మాట్లాడిన ప్రధాని మోడీ కాశ్మీర్ వెళ్లాలని సూచించారు. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది.

Read Also: MLC Elections : ఈరోజే పోలింగ్

Asaduddin Owaisi Breaking News in Telugu Google news Google News in Telugu Jammu and Kashmir terror attack Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.