📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

ప్రభుత్వం కంటే ప్రైవేట్ పాఠశాలలు గొప్పవా ? : సీఎం రేవంత్ రెడ్డి

Author Icon By sumalatha chinthakayala
Updated: March 12, 2025 • 5:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ..నిరుద్యోగ సమస్య తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిందని, రాష్ట్ర సాధనలో నిరుద్యోగులు క్రియాశీల పాత్ర పోషించారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగులు పునాదులుగా మారారని పేర్కొన్నారు. గత ప్రభుత్వానికి ఉద్యమం పట్ల బాధ్యత లేక నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరకలేదన్నారు. గత ప్రభుత్వ పెద్దల ఉద్యోగాలు తీస్తేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని తాను చెప్పినట్లు సీఎం గుర్తు చేశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక 50వేలకు పైగా నియామకాలు

జూనియర్ లెక్చరర్‌, పాలిటెక్నిక్‌ లెక్చరర్ల ఉద్యోగాలకు ఎంపికైన 1,532 మందికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. కొత్తగా ఉద్యోగ బాధ్యతలు చేపడుతున్న వారికి సీఎం అభినందనలు తెలిపారు. కొత్త అధ్యాపకులు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంవైపు నడిపించాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక 50వేలకు పైగా నియామకాలు చేపట్టాం. ఉద్యోగ నియామకాలకు సంబంధించి కోర్టుల్లో ఉన్న చిక్కుముళ్లు విప్పుతూ సమస్యలు పరిష్కరించాం. గతంలో సంతలో సరకులా ప్రశ్నపత్రాలు అమ్మారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందని పెద్దలు చెప్పారు.

విద్యార్థుల భవిష్యత్తును విద్యాశాఖ తీర్చిదిద్దాలి

30వేల ప్రభుత్వ పాఠశాలల్లో 25లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 11వేల ప్రైవేటు పాఠశాలల్లో 36.7లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వం కంటే ప్రైవేటు పాఠశాలలు గొప్పవా? ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు రూ.25వేల వరకు ఖర్చవుతుంటే.. ప్రభుత్వ బడుల్లో రూ.లక్ష వరకు ఖర్చవుతోంది. విద్యార్థుల భవిష్యత్తును విద్యాశాఖ తీర్చిదిద్దాలి. గతంలో విద్యాశాఖ నిర్లక్ష్యానికి గురైంది. విద్యాశాఖను ప్రక్షాళన చేసి ప్రభుత్వం అండగా ఉంది. విద్యకు ప్రాధాన్యం ఇచ్చి విద్యాశాఖకు రూ.21,650 కోట్లు కేటాయించాం అని సీఎం వివరించారు.

Breaking News in Telugu CM Revanth Reddy Google news Google News in Telugu government schools Latest News in Telugu private schools Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.