SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం లభ్యం!

Read Time:  1 min
Another body found in SLBC tunnel!
Another body found in SLBC tunnel!
FONT SIZE
GET APP

SLBC Tunnel: నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమల పెంట గ్రామ సమీపంలోని ఎస్ఎల్బీసీ టెన్నెల్లో ప్రమాద ఘటనలో ఎనిమిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మిగిలిన ఏడు మంది కోసం జరుగుతున్న సహాయక చర్యల్లో 32వ రోజున మరో మృతదేహం లభించడంతో పురోగతి కనిపిస్తున్నది. మినీ హిటాచితో మట్టి ఇతర శఖలాలు తొలగిస్తున్న క్రమంలో కన్వేయర్‌ బెల్ట్‌కు సుమారు 50 మీటర్ల దూరంలో మృతదేహం కనిపించినట్లు తెలుస్తుంది.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం

మరో ఆరుగురి కోసం సొరంగంలో తవ్వకాలు

ఆ మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మొత్తంగా గడచిన 32 రోజులుగా జరుగుతున్న సహాయక చర్యల్లో సుమారు 700 మంది ఆపరేషన్ నిర్వహిస్తూ వారికోసం కొనసాగిస్తున్న అన్వేషణ ఇప్పటివరకు రెండు మృతదేహాలు లభ్యంకాగా..మరో ఆరుగురి కోసం సొరంగంలో తవ్వకాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ విషయంపై ఆ మృతదేహం ఎవరిది అనేది గుర్తించి అధికారుల నిర్ధారిస్తూ ప్రకటన చేయాల్సి ఉంది.

మరో మృతదేహం గుర్తింపు

కాగా, శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పైకప్పు కూలిపోయి నెల రోజులకు పైగా గడిచినా కార్మికులలో ఏడుగురి మృతదేహాలను వెలికితీయడానికి సహాయకులు కష్టపడుతున్నారు. ఫిబ్రవరి 22న 14 కిలోమీటర్ల సొరంగంలో ఒక భాగం కూలిపోయిన విషయం తెలిసిందే. 50 మంది కార్మికులు సొరంగం నుండి బయటకు రాగలిగారు.. సొరంగం పైకప్పు కూలిపోయిన తర్వాత ఎనిమిది మంది లోపల చిక్కుకుపోయారు. ఇప్పటివరకు, ఒక మృతదేహాన్ని మాత్రమే వెలికి తీశారు. ఇప్పుడు మరో మృతదేహాన్ని రెస్క్యూ టీమ్‌ గుర్తించింది.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.