📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: Maoists: మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ

Author Icon By Anusha
Updated: September 25, 2025 • 10:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దంతెవాడ జిల్లాలో 71 మంది లొంగుబాటు

వారిలో 21 మంది మహిళలు

చర్ల (ఖమ్మం) : గడిచిన నాలుగు దశాబ్దాలుగా దండకారణ్యం ప్రాంతంలో సామంతర పాలన నడిపిన మావోయిస్టు (Maoists) లకు నేడు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పార్టీకు దిశానిర్ధేశం చేసే కేంద్రకమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు (Nambala Kesava Rao) మృతితో పార్టీలో నాయకత్వలేమి కనిపించింది. అనంతరంజరిగిన వివిధ ఎన్కౌంటర్లో ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు మృతిచెందగా… మరో సభ్యురాలు లొంగిపోయారు.

పార్టీలో అంతర్గతంగా నెలకొన్న విభేధాలతో సతమతమవుతున్న క్రమంలో మావోయిస్టు పార్టీ (Maoist Party) కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా దంతెవాడ జిల్లాలో 71 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ లొంగుబాటు వివరాలను బస్తర్ రేంజ్ ఐజి పి.సుందర్రాజ్ వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన లొన్వర్రాట్టు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని అన్నారు.

Maoists

స్వయం ఉపాధి అవకాశాలు వంటివి

మావోయిస్టు పార్టీలో వివిధ క్యాడర్లో పనిచేస్తున్న 71 మంది లొంగిపోయారని, వీరిలో 21 మంద మహిళలు ఉన్నట్లు ఆయన తెలిపారు. లొంగిపోయిన వారికి పునరావాస విధానం (Rehabilitation policy) ప్రకారం తక్షణ సహాయంగా రూ. 50వేల నగదును అందజేస్తామని, నైపుణ్య, అభివృద్ధి శిక్షణ, వ్యవసాయ భూమి, స్వయం ఉపాధి అవకాశాలు (Self employment opportunities) వంటివి వీరికి లభిస్తాయని అన్నారు. నేటి వరకు ఈ కార్యక్రమం ద్వారా (లోన్వర్రాట్టు) ప్రచారం ద్వారా 1113మంది మావోయిస్టులు లొంగిపోయారని, వీరిలో 297 మందిపై రివార్డు కలిగి ఉన్నారని,

దంతెవాడ జిల్లాలోనే గత 19 నెలల్లో 461 మంది నక్సలైట్లు లొంగిపోగా వీరిలో 129 మంది రివార్డు కలిగి ఉన్నారని అన్నారు. హింస, వలన సాధించేది ఏమీ లేదని, అడవి బాట వీడి జనజీవన స్రవంతిలో కలిసి ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, మావోలందరూ తమ కుటుంబాలు, సమాజం కోసం హింసా మార్గాన్ని విడిచి శాంతి, అభివృద్ధి వైపు పయనించాలని అన్నారు. ఈ సమావేశంలో దంతెవాడ రేంజ్ డిఐజి కమలోచన్ కశ్యప్, సిఆర్పిఎఫ్ డిఐజి (ఆపరేషన్స్) రాకేష్రెచౌదరి, దంతెవాడ ఎస్పీ గౌరవ్రాయ్, సీఆర్పీఎఫ్, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News Central Committee Leadership Crisis Charla Khammam Dandakaranya Region latest news Maoist Encounters Maoists Nambala Kesava Rao Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.