డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్కి (Annapurna Studios) ప్రత్యేకంగా వెళ్లి పర్యటించారు. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఆహ్వానం మేరకు జరిగిన ఈ సందర్శనలో, సినిమా రంగం అభివృద్ధి గురించి ఇద్దరూ చర్చించారు. తెలుగు చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని భట్టి చెప్పారు.
Read also: Big Alert : వాహనదారులకు అలర్ట్.. ఓవర్ లోడ్ తో వెళ్తున్నారా..?

Bhatti Vikramarka visited Annapurna Studios
స్టూడియోకు చేరుకున్న వెంటనే నాగార్జున భట్టికి స్వాగతం పలికారు. అనంతరం అక్కడ ఉన్న అక్కినేని నాగేశ్వరరావు విగ్రహానికి డిప్యూటీ సీఎం పూలమాల అర్పించారు. స్టూడియోలో అమర్చిన నూతన సాంకేతిక పరికరాలు, ఫిల్మ్ స్కూల్లో జరుగుతున్న శిక్షణా విధానాలు, విద్యార్థులకు అందిస్తున్న అవకాశాల గురించి నాగార్జున వివరంగా తెలియజేశారు.
తెలంగాణ యువతకు మరింత అవకాశాలు
పర్యటనలో భాగంగా భట్టి విక్రమార్క స్టూడియోలో రూపొందించిన ఒక చిన్న చిత్రం కూడా వీక్షించారు. తర్వాత ఫిల్మ్ స్కూల్ విద్యార్థులతో మాట్లాడిన ఆయన, సినిమా, మీడియా, డిజిటల్ కంటెంట్, క్రియేటివ్ రంగాల్లో తెలంగాణ యువతకు మరింత అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :