📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Alleti Maheshwar Reddy: అప్పులపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Author Icon By Sharanya
Updated: March 21, 2025 • 3:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు సుమారు రూ. 1,700 కోట్లకు పైగా అప్పు చేస్తోందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ప్రస్తుతం రాష్ట్రం అప్పు రూ. 8.6 లక్షల కోట్లకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో జరిగిన చర్చ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమిషానికి రూ. 1 కోటికి పైగా అప్పు చేస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించారు.

ప్రజలపై రుణభారం పెరుగుతుందని హెచ్చరిక

రాష్ట్ర ప్రజలపై ఈ అప్పుల ప్రభావాన్ని వివరిస్తూ, ప్రతి వ్యక్తిపై రుణభారం సుమారు రూ. 2.27 లక్షలుగా ఉందని మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈ స్థాయిలో రుణాలు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పెరుగుతున్న అప్పులతో భవిష్యత్‌ తరాలు సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధుల కేటాయింపుపై మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి, యూపీఏ హయాంలో రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా 32 శాతం మాత్రమే ఉండేదని గుర్తు చేశారు. అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాటాను 42 శాతానికి పెంచిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులను పెంచి ఇచ్చినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక పరిపాలనలో విఫలమై అప్పులు చేస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వ అప్పులపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ, అధికార పార్టీ తరఫున అప్పులు రాష్ట్ర అభివృద్ధికి అవసరమేనని, మౌలిక సదుపాయాల కోసం ఉపయోగిస్తున్నామని చెబుతోంది. అయితే, రాబోయే రోజుల్లో ఈ అప్పుల ప్రభావం ప్రజలపై ఎంతవరకు పడుతుందనేది వేచిచూడాల్సిన అంశం.

#AlletiMaheshwarReddy #bjp #CONGRESS #DebtCrisis #PoliticalDebate #RevanthReddy #telangana #TelanganaPolitics Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.