📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

టీడీపీ, బీజేపీ పొత్తు వల్ల ఏపీకి అన్ని అనుమతులు: కవిత

Author Icon By sumalatha chinthakayala
Updated: February 15, 2025 • 5:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అభివృద్ధిలో వీరు చేసిందేమీ లేదని విమర్శ

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఖమ్మంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… సేవాలాల్ జయంతి వేడుకలు అధికారికంగా జరుగుతుండటం కేసీఆర్ చలవేనని చెప్పారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు. కేసీఆర్ రాకముందు పేద ఇంటి ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే ఎంతో ఇబ్బంది పడేవారని… కేసీఆర్ వచ్చిన తర్వాత కళ్యాణలక్ష్మి పథకంతో పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లను సులభతరం చేశారని చెప్పారు.

ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు రాజీనామా చేయాలి

ఖమ్మంలో పేరుకే ముగ్గురు మంత్రులు ఉన్నారని… అభివృద్ధిలో మాత్రం వీరు చేసిందేమీ లేదని కవిత విమర్శించారు. అభివృద్ధి చేయలేని ఈ ముగ్గురు మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని అన్నారు. ప్రజల అంచనాలకు మించి కేసీఆర్ ప్రభుత్వం పని చేసిందని చెప్పారు.

కేంద్రం అనుమతి లేకుండానే ఏపీలో ప్రాజెక్టులు

టీడీపీ, బీజేపీ పొత్తులో ఉండటం వల్ల ఏపీకి అన్ని అనుమతులు వస్తున్నాయని కవిత అన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ కు అనుమతి వస్తే తెలంగాణకు చాలా నష్టమని చెప్పారు. కేంద్రం అనుమతి లేకుండానే ఏపీలో ప్రాజెక్టులు కడుతున్నారని అన్నారు. కళ్ల ముందే నీళ్లు వెళ్లిపోతున్నా… సీఎం సొంత జిల్లాలో ఒక్క తట్ట మట్టి కూడా ఎత్తిపోయలేదని విమర్శించారు. పోలవం ఏడు మండలాల కోసం తాము ఎంతో పోరాటం చేశామని చెప్పారు.

Breaking News in Telugu brs Google news Google News in Telugu kavitha Latest News in Telugu Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.