📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

Agriculture : అంగన్వాడీ కేంద్రాల్లో కూరగాయల సేద్యం

Author Icon By Shravan
Updated: August 11, 2025 • 3:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ (Agriculture) : అంగనవాడీ కేంద్రాల్లో (Anganwadi centers) చదువుకునే పిల్లల ఆరోగ్యం, షోణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆంద్ర ప్రభుత్వ పోషణ్ వాటిక పథకం కింద రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో కూరగాయల తోటలను పెంచాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలుండగా.. మొదటి విడతలో 4500 కేంద్రాల్లో టమాట, వంకాయ, దొండ కాయ, పాలకూర, తోటకూర, మెంతికూరలను పండించేందుకు ప్రణాళిక సిద్ధం చేయగా.. వీటి విత్తనాలను జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ (ఎన్ఎస్సీ) పంపిణీ చేయనుంది. పెంపకం అనంతరం వీటిని లబ్దిదారుల వంటల కోసం వినియో గిస్తారు. ప్రస్తుతం ఈ కేంద్రాల్లో కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. కొన్ని సమయాల్లో వాటిలో నాణ్యత లోపించడం, వాతావారణ పరిస్థితులు కారణంగా అవి సకాలంలో సరైన అందుబాటులో లేకపోవడం, ఒకవేళ ఉన్నా అవి అందుబాటు ధరల్లో ఉండకపోవడంతో వాటిని ఆయా కేందాల్లో చదువకునే పిల్లలకు అందించడం కష్టంగా మారింది. ఇటువంటి పరిస్థితులపై ప్రత్యేకంగా కేంద్రం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో పోషణ్ వాటిక పథకం అమలుపై సమీక్ష
సందర్భంగా ఈ అంశాలన్నింటినీ చర్చించి అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం చేపట్టాలని కేంద్రం సూచించింది. దీనికి అవసరమైన విత్తన కిట్లను తయారు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేయాలని ఎన్ఎస్సీకి ఆదేశించింది. వీటిని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తారు. రాష్ట్ర ఉద్యాన అధికారులు కేంద్రాలను సందర్శించి కూరగాయల సాగుకు (vegetable cultivation) అనువైన సౌకర్యాలు కల్పిస్తారు. విత్తనాలు వేసిన తర్వాత వాటి పెంపకాన్ని పర్యవేక్షిస్తారు. ఈ పథకం విజయవంతంగా అమలయితే ఆయా కేంద్రాల్లో ఉండే పిల్లలకు మంచి పోషణ లభించడమే కాకుండా వారికి నాణ్యమైన కూరగాయలను అందించినట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/sports-international-cricket-stadium-to-be-built-in-fourth-city/business/528906/

agriculture anganwadi centers Breaking News in Telugu Government Schemes Latest News in Telugu Telugu News online vegetable cultivation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.