తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు (TG Govt Schools) తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పొందుతున్నాయి. 2024-25 విద్యా సంవత్సరం కోసం జూన్ 12న పాఠశాలలు ప్రారంభమైన తర్వాత, ఇప్పటివరకు 2,56,156 మంది విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల నాణ్యత, మధ్యాహ్న భోజనం, కిట్స్ పంపిణీ, బస్తీ దవాఖానాలు వంటి అనేక హక్కుల అమలు వల్ల తల్లిదండ్రులు మళ్లీ ప్రభుత్వ పాఠశాలలవైపు మొగ్గుచూపుతున్నారు.
ప్రధానంగా మొదటి తరగతిలో ఎక్కువ చేరికలు
ఈ ఏడాది అడ్మిషన్లలో ముఖ్యంగా మొదటి తరగతిలో 1,07,126 మంది విద్యార్థులు చేరినట్టు సమాచారం. ఇక 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 1,49,030 మంది విద్యార్థులు కొత్తగా చేరారు. గత విద్యా సంవత్సరం కంటే ఈసారి 55,000 మందికి పైగా ఎక్కువగా విద్యార్థులు చేరారు. ఇది ప్రభుత్వ పాఠశాలలపై పెరుగుతున్న భరోసాకు నిదర్శనంగా పేర్కొంటున్నారు అధికారులు.
హైదరాబాద్లోనే అత్యధిక అడ్మిషన్లు
రాష్ట్రంలోని అన్ని జిల్లాలకంటే హైదరాబాద్ జిల్లాలోనే అత్యధికంగా 19,555 మంది విద్యార్థులు కొత్తగా చేరినట్టు అధికారులు తెలిపారు. నగరంలోని మున్సిపల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, గవర్నమెంట్ హై స్కూల్స్లో వసతులు మెరుగుపడడం, ఆంగ్ల మాధ్యమ విద్య అందుబాటులో ఉండటం, విద్యా వనరుల పెంపు వంటి అంశాలు ఈ చేరికల్లో కీలక పాత్ర పోషించాయని పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో విద్యాశాఖ అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు.
Read Also : Iran :అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు :ఇరాజ్ ఎలాహి