Aditi Scheme: టీజీతో సహా ఐదు రాష్ట్రాల్లో అదితి పథకం

Read Time:  1 min
Aditi Scheme
Aditi Scheme
FONT SIZE
GET APP

ఫార్మా రంగంలో వినూత్న సాంకేతికత

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఈ పథకం అమలు

హైదరాబాద్ : దేశంలో ఫార్మా పరిశ్రమల రంగంలో ప్రపంచ ఇంధన సామర్థ్య
సాంకేతికతలను ప్రోత్సహించడానికి తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలను అదితి పథకం కింద కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ (బిఇఇ) ఎంపిక చేసింది. వీటిలో బడ్డి, మడ్గావ్, అహ్మదాబాద్, బీదర్ తోపాటు, తెలంగాణలోని మెదక్ కూడా ఉంది. మెదక్ ఫార్మా రంగంలో అత్యాధునిక ఇంధన సాంకేతికతలను అందించడం ద్వారా ఎంఎస్ఎంఇ రంగానికి తాము తీసుకున్న రుణాలపై వడ్డీ రాయితీ అందించడం ద్వారా ఆర్థికంగా మరింత ఊతం ఇవ్వడం కోసం బిఇఇ మెదక్ ను ఎంపిక చేసింది.

అమలు చేసేందుకు

ఇంధన సమర్థ్య చర్యల అమలులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి అనేక రాష్ట్రాల చురుకైన పాత్రను విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా గుర్తించింది. అదే సమయంలో ఫార్మా రంగంలో అదితి పథకాన్ని మెదక్లో అమలుచేయనుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేసేందుకు ముందుకు వచ్చి భారతదేశ స్వచ్ఛమైన పారిశ్రామిక వృద్ధిలో అదితి పథకాన్ని (Aditi Scheme) ఒక మలుపుగా మార్చాలని పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఇ రంగాన్ని బలోపేతం చేయడం, స్థిరమైన పారిశ్రామిక పద్ధతులను ప్రోత్సహించడానికి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అసిస్టెన్స్ ఇన్ డిప్లొయింగ్ ఎనర్జీ ఎఫిషియంట్ టెక్నాలజీ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ (అదితి) పథకం రూపకల్పన చేసి దాని అమలుకోసం రూ. వెయ్యి కోట్ల బడ్జెట్ను కేటాయించింది.

Aditi Scheme
Aditi Scheme

తక్షణమే దృష్టి

ఇందులోభాగంగా పరిశ్రమల స్థాపనలో ఇంధనసామర్థం టెక్నాలజీలను అమలు చేయడంలో సహాయం చేసేందుకు గత నెల 15న పానిపట్ నుండి ప్రారంభించబడిన ఈ పథకాన్ని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బిఇఇ) అమలు చేస్తోంది. ఇది లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఇ రంగానికి ఆర్థిక వెన్నెముకగా నిలవనుంది. జాతీయ స్థాయిలో ఈ పథకం అమలులో భాగంగా అన్ని రాష్ట్రాలు ఈపథకం అమలుపై తక్షణమే దృష్టి సారించి తగు చర్య తీసుకోవాలని విద్యుత్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, బిఇఇ డైరెక్టర్ జనరల్ ఆకాష్ త్రిపాఠి (Akash Tripathi) చెప్పారు. ఈ పథకం విజయవంతమయ్యేలా నిర్వాహకులు వారి పరిశ్రమలకు ప్రయోజనాలను పెంచుకోవడానికి ఈ అవకాశాన్ని మొదటి నుండే ఉపయోగించుకోవాలని అన్ని రాష్ట్రాలను కోరుతున్నామన్నారు.

మొత్తం పెట్టుబడులను

రూ. వెయ్యి కోట్ల బడ్జెట్లో రూ. 875 కోట్లు వడ్డీ రాయితీగా కేటాయించబడ్డాయన్నారు. ఇంధనసమర్థవంతమైన సాంకేతికతల అప్గ్రేడ్ల కోసం రాయితీ ఫైనాన్స్ను సులభతరం చేయడానికి రూ.50 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఈ చొరవ ఎంఎస్ఎంఇల ద్వారా గణనీయమైన రుణాలతో సహా రూ.9 వేల కోట్లకు పైగా మొత్తం పెట్టుబడులను ప్రభావితం చేస్తుందని భావిస్తున్నామన్నారు. ఎంఎస్ఎంఈ రంగానికి ఈ పథకం సమగ్ర మద్దతును అందిస్తుందన్న ఆయన ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్స్ (ఐజిఇఎ), వివరణాత్మక ప్రాజెక్ట్ రిపోర్ట్స్ (డిపిఆర్లు) నుండి ఫైనాన్సింగ్ సహాయం మరియు పర్యవేక్షణ మరియు ధృవీకరణ (ఎం అండ్ వి) వరకు కొలవగల ఇంధన ఆదా, తగ్గిన ఖర్చులు మరియు మెరుగైన ఉత్పాదకతను నిర్ధారిస్తుందని తెలిపారు.ఎసిడిఎల పాత్ర కీలకంరాష్ట్ర స్థాయిలో ఈ పథక అమలు ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

అదితి పథకం అంటే ఏమిటి?

అదితి పథకం అనేది భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఒక స్కీమ్, దీని పూర్తి రూపం “ఆగ్మెంటింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఫర్ ఇండియన్ ఐడెంటిఫైడ్ నీడ్స్ (Augmenting Development of Innovative Technologies for Indian Needs)”. ఇది రక్షణ రంగంలో స్టార్టప్‌లు, MSMEలు, వ్యక్తిగత ఆవిష్కర్తలను ప్రోత్సహించడానికి రూపొందించబడింది.

అదితి పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి?

దేశీయ రక్షణ ఉత్పత్తుల అభివృద్ధి, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం పెంపు, ఆవిష్కరణలను ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యం.

Read hindi news: hindi.vaartha.com

Read Also: 

https://vaartha.com/ai-real-time-in-farming-artificial-intelligence-for-farmers/telangana/524849/

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.