📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

Addanki Dayakar: కేటీఆర్‌‌పై అద్దంకి దయాకర్ సెటైర్లు

Author Icon By Sudheer
Updated: July 8, 2025 • 3:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మంగళవారం ఓ మీడియా చానల్‌తో మాట్లాడిన ఆయన, కేటీఆర్ చెయ్యే ప్రయత్నాలను “చిల్లర రాజకీయాలు”గా పరిగణించారు. కేటీఆర్‌ని చూస్తే జాలివేస్తోందని ఎద్దేవా చేశారు. చర్చలకు అసెంబ్లీ ఉండగా బయట ప్రజల్లో డ్రామాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ కంటే సీఎం రేవంత్‌రెడ్డే పెద్ద నాయకుడు అని పేర్కొన్నారు. చర్చకు నిజంగా ధైర్యం ఉంటే, కేటీఆర్ తన తండ్రి కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురావాలని సవాల్ విసిరారు.

తెలంగాణ ఉద్యమం – నిజమైన పోరాటకారులపై అవమానకర వ్యాఖ్యల ఆగ్రహం

తెలంగాణ ఉద్యమం సమయంలో తమ ముఖాలు ఎక్కడున్నాయని బీఆర్ఎస్ నేతలను అద్దంకి దయాకర్ నిలదీశారు. సాగరహారం జరిగినప్పుడు మీకేం తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. “సారా అమ్మి జై తెలంగాణ అంటారు. ఫోన్ ట్యాపింగ్ చేసి కూడా జై తెలంగాణ అంటారు” అంటూ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ తన చెల్లెలు కవిత ఫోన్‌ను ట్యాప్ చేసి అణచివేశాడని, ఆమె వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా? అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ ప్రజలను మోసం చేసిన దొంగలు అని తీవ్రంగా మండిపడ్డారు.

ఫోన్ ట్యాపింగ్, మీడియా విమర్శలపై విమర్శలు

ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ ద్వారా కాంగ్రెస్‌ను అడ్డుకుంది అని ఆరోపించిన దయాకర్, అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు వచ్చేవని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సెంటిమెంట్‌ను రాజకీయం కోసం వాడుకుంటూ, ఆంధ్రా మీడియా అంటూ విమర్శించడాన్ని ఆయన తప్పుపట్టారు. “మీడియా అనుకూలంగా రాస్తే మంచిదా? వ్యతిరేకంగా రాస్తే చెడ్డదా?” అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్‌రావు అందరూ కలిసినా రేవంత్‌ను ఢీకొలేకపోయారని పేర్కొన్నారు. “ఇంకా పిచ్చిమాటలు మాట్లాడితే మా తడాఖా చూపిస్తాం” అంటూ హెచ్చరించారు.

Read Also : IRCTC : అదిరిపోయే IRCTC వీక్లీ టూర్ ప్యాకేజెస్

Addanki Dayakar ktr revanth

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.