రోడ్డు ప్రమాదాలపై తన వ్యాఖ్యలను కొన్ని వర్గాలు తప్పుగా అర్థం చేసుకున్నాయని బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల ఒక కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వివిధ వర్గాల నుండి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కొండా వివరణ ఇస్తూ, “నేను చెప్పింది రోడ్లు బాగుంటే కాదు, వంపులు ఎక్కువగా ఉన్నా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని. కానీ నా మాటలను కత్తిరించి, రోడ్లు బాగుంటేనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని చెప్పినట్లు వీడియో ఎడిట్ చేశారు” అని తెలిపారు.
Latest News: Guntur: ఉప్పుతో రూపొందించిన అద్భుత శివపార్వతి రూపం!
ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వివరించగా, రోడ్ల నిర్మాణం, డిజైన్, వంపులు వంటి అంశాలు ప్రమాదాల సంఖ్యపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని చెప్పారు. “మన రోడ్లు సరిగా డిజైన్ చేయకపోతే, కచ్చితమైన వంపులు, వెడల్పు లేని చోటు ప్రమాదాలకు దారితీస్తాయి. రోడ్డు నాణ్యతతో పాటు, దాని ఆకృతిని కూడా సరిగా పరిగణనలోకి తీసుకోవాలి” అని అన్నారు. ఆయన వ్యాఖ్యలను రాజకీయంగా దుర్వినియోగం చేయడం సరికాదని హెచ్చరించారు.

అదేవిధంగా, గతంలో రోడ్డు విస్తరణ కోసం చేపట్టిన భూసేకరణలో కూడా కొంతమంది రియల్ ఎస్టేట్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకున్నారని తెలిపారు. “రోడ్లు ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా రియల్ ఎస్టేట్ దృష్టితో రూపొందించబడ్డాయంటే అది తప్పు దిశలో అభివృద్ధి” అని కొండా విమర్శించారు. రోడ్డు నిర్మాణం అనేది కేవలం సౌందర్యం కోసం కాదు, భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని చేయాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు. “నా వ్యాఖ్యల ఉద్దేశ్యం ప్రజల భద్రత గురించే. దాన్ని రాజకీయంగా వక్రీకరించడం బాధాకరం” అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/