📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

కేటీఆర్‌ లాయర్లను అనుమతించని ఏసీబీ..

Author Icon By sumalatha chinthakayala
Updated: January 6, 2025 • 11:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్న ఫార్మూలా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. బంజారాహిల్స్ ఏసిబి వద్ద కేటీఆర్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కేటీఆర్ వెంట లాయర్లను వెళ్లడానికి అనుమతించకపోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తన వెంట లాయర్లు ఎందుకు రాకుడదు అని కేటీఆర్ అధికారులను ప్రశ్నించారు. దాదాపు అరగంటపాటు అక్కడ ఎదురుచూసిన కేటీఆర్.. చివరికి ఏసీబీ ఆఫీసులోపలికి వెళ్లకుండానే వెనుదిరిగారు.

విచారణకు అడ్వకేట్‌కు అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీకి కేటీఆర్ న్యాయవాది నోట్ ఇచ్చారు. నోట్ తీసుకున్న ఏసీబీ అధికారులు లాయర్లను వెంట పంపించేందుకు అనుమతించలేదు. చట్ట ప్రకారం ప్రతి పౌరుడికి ఉన్నతన హక్కులను వినియోగించుకోవచ్చునని.. లాయర్లను లోపలికి అనుమతించకపోవడంపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏసీబీ ఆఫీసు నుంచి కేటీఆర్ వెళ్లిపోయారు. అటు నుంచి నేరుగా తెలంగాణ భవన్ కు వెళ్లి పార్టీ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు.

అంతకుముందు నందినగర్ లోని కేసీఆర్ ఇంటికి వచ్చిన కేటీఆర్..అక్కడ లీగల్ టీమ్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేసుకు సంబంధించి ఏసీబీ చేస్తున్న ఆరోపణలు..వాటికి చెప్పాల్సిన సమాధానాలపై వివరాలను తీసుకున్నారు కేటీఆర్. ఆ తర్వాత బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలను కేటీఆర్ కలిశారు. నాయకులతో భేటీ తర్వాత ఏసీబీ ఆఫీసుకు వెళ్లారు కేటీఆర్. 2022 జులై లో హైదరాబాద్ లో జరిగిన ఈ రేస్ లో ప్రభుత్వ నిధులను కేటీఆఱ్ విదేశీ సంస్థలకు అనుమతులు లేకుండా మళ్లించారంటూ ఆయనపై ఆరోపణలు రాగా..ప్రభుత్వం ఈ కేసులో ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఇక ఇదే కేసులో రేపు ఈడీ విచారణకు కూడా కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది.

ACB officials KTR lawyers telangana bhavan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.