📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

కవిత వల్లే ఢిల్లీలో ఆప్ ఓటమి – కొండా సురేఖ

Author Icon By Sudheer
Updated: February 9, 2025 • 8:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ (BRS) పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఓటమికి కారణం కల్వకుంట్ల కవిత అని ఆరోపించారు. కేజ్రీవాల్ ప్రభుత్వంతో కలిసి లిక్కర్ స్కామ్ చేసినందువల్లే ఆప్ పరాజయం పాలైందని ఆమె విమర్శించారు.

బిఆర్ఎస్ పార్టీ ఎక్కడికి వెళ్లినా, ఏ పార్టీతో కలిసినా ఆ పార్టీకి రాజకీయంగా నష్టం తప్పదని ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మరోసారి నిరూపించాయని సురేఖ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలు, లిక్కర్ స్కామ్ వివాదం ఆప్ పరాజయానికి ప్రధాన కారణమని ఆమె స్పష్టం చేశారు. ఢిల్లీ ఫలితాల నేపథ్యంలో రాహుల్ గాంధీపై KTR చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అహంకారంతో నిండిపోయాయని కొండా సురేఖ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అహంకారానికి స్థానం లేదని, అలాంటి దురహంకారాన్ని ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు.

బిఆర్ఎస్ పార్టీపై ప్రజలు ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నారని, ఈ పార్టీ ఇక రాజకీయంగా నిలబడలేదని కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు BRS పార్టీని తిరస్కరించడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. బిఆర్ఎస్ అధినాయకత్వం ఇప్పటికైనా ప్రజల తీర్పును గౌరవించి, తమ తప్పులను అంగీకరించి మారాలని సూచించారు. లేకపోతే, మరిన్ని ఎన్నికల్లో ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు.

AAP lost in Delhi BRS MLC Kavitha Google news KONDA SUREKHA

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.