తెలంగాణ (Telangana) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా నార్సింగి మున్సిపాలిటీ వన మహోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించింది. మణికొండ సమీపంలోని గండిపేట మెలుహ కళాశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, (MLA Prakash Goud) రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీదేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొక్కలు నాటి, వాతావరణ పరిరక్షణకు అందరూ కట్టుబడి ఉండాలని సందేశం ఇచ్చారు.పర్యావరణ అవగాహన పెంచే ఉద్దేశంతో ఐదు కిలోమీటర్ల ‘5కే రన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ జెండా ఊపి ఈ పరుగును ప్రారంభించారు. ఇందులో చిన్నాపెద్దలతో పాటు మహిళలు, యువత కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.కార్యక్రమం సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన ఉత్పత్తుల స్టాళ్లకు మంచి స్పందన లభించింది. చేతివృత్తుల ప్రదర్శనలు, పారిశ్రామిక ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు
5కే రన్లో పాల్గొన్న ప్రతిభావంతులందరికీ గుర్తింపుగా సర్టిఫికెట్లు అందజేశారు. యువతలో ఆరోగ్యపరమైన స్పూర్తిని పెంచేలా ఈ కార్యక్రమం కొనసాగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ, 100 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రజా అవసరాలపై దృష్టి పెట్టామని చెప్పారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి కార్యాచరణ ప్రణాళికతో సాగుతుందని తెలిపారు.
ప్రజల సహకారమే విజయానికి బాట
ఈ కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. ప్రజల భాగస్వామ్యం వల్లే ప్రభుత్వ యజమాన్యంలో సామూహిక ప్రయోజనాలు సాధ్యమవుతాయని అన్నారు.
Read Also : Andhrapradesh : గోడ కూలిన ఘటనలో ఇద్దరు కూలిలు మృతి