హైదరాబాద్: రాష్ట్రంలో ఎంపిటిసి(MPTC) స్థానాల లెక్క తేలింది. మొత్తంగా 5,774 స్థానాలు ఉన్నట్టు పంచాయతీరాజ్(Panchayat) శాఖ ఖరారు చేసింది. ఈనెల 12తో ఎంపిటిసి స్థానాల పునర్విభజన పూర్తయింది. దీంతో స్థానాలపై స్పష్టత వచ్చింది. గత మార్చిలో 5,817 ఎంపిటిసి స్థానాలు ఉండగా… ప్రస్తుతం ఆ సంఖ్య 5,774కు తగ్గింది. కొత్తగా ఏర్పాటైన మున్సి పాలిటీలు, కార్పొరేషన్ల(Corporation)లో పలు గ్రామాలు విలీనం కావడం, ఓఆర్ఆర్లోని గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం వేయడమే ఇందుకు కారణం కొన్ని మండలాల్లో జనాభా ప్రకారం రెండు, మూడు ఎంపిటిసి స్థానాలే ఉండటంతో ప్రభుత్వం చట్ట సవరణ చేసింది.
కొత్తగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు
ఒక మండలంలో కనీసం ఐదు ఎంపీటీసీల స్థానాలు ఉండే విధంగా మార్పులు వేసింది. వాస్తవానికి ఒక ఎంపిటిసి స్థానానికి 3,500 జనాభా ఉండాలి. ఎంపిపి వైస్ఎఎంపీపీలకు ఇద్దరు ఎంపిటిసి కావాలి. వారిని ఎన్నుకోవడానికి, వారు వేదిక మీద కూర్చుంటే సమావేశానికి హాజరుకావడానికి కనీసం మరో ఎంపిటిసి అయినా ఉండాలి. కానీ పలు గ్రామాల్లో ఆ పరిస్థితులు లేకపోవడంతో ప్రతి మండలంలో కనీసం ఐదుగురు ఎంపిటిసిలు ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో అనేక మండలాల్లో ఐదు ఎంపిటిసిల స్థానాలు ఏర్పడ్డాయి, రాష్ట్రంలో గతమార్చి తర్వాత కొత్తగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పడటంతో సమీప గ్రామాలను అందులో కలిపారు.
5,817 ఎంపీటీసీ స్థానాలు
ఓఆర్ ఆర్ లోపలి గ్రామాలను సైతం సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. దీంతో ఎంపిటిసిల స్థానాలు సంఖ్య తగ్గింది. గత మార్చిలో 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 5,774కు తగ్గింది. మేడ్చల్మల్కాజ్లిరి జిల్లాలో 19 ఎంపిటిని స్థానాలు ఉండగా ఆ జిల్లాను అర్బన్ జిల్లా మార్చారు. దీంతో 19 స్థానాలు కనుమ రుగైపో యాయి. ఖమ్మం, నారాయ ణపేట్, నాగర్ కర్నూలు, కొత్తగూడెం జిల్లాల్లో నాలుగు చొప్పున, ములుగు, సంగారెడ్డి జిల్లాల్లో మూడు చొప్పున, రంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాలో ఒకటి చొప్పున ఎంపిటిసి స్థానాలు పట్టణ స్థానిక సంస్థల్లో వీలి నమయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా నెల్గొండ జిల్లాలో 352 ఎంపిటీసీ స్థానాలు ఉండగా.. అత్యల్పం గా ములుగు జిల్లాలో 84 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.
జిల్లాల వారీగా..
ఎంపిటిసిల స్థానాల వివరాలు మంచిర్యాలలో 166, ఆసిఫాబాద్లో 127, మంచిర్యాలలో 129, నిర్మల్ 157, కరీంనగర్లో 170. జగిత్యాలలో 216, సిరిసిల్లలో 123, పెద్దపల్లిలో 139, నిజామాబాద్లో 307, కామారెడ్డిలో 237, సిద్ధిపేటలో 230, సంగారెడ్డిలో 273, మెడక్లో 190. రంగారెడ్డిలో 231, వికారాబాద్లో 227, మహా బూట్నగర్లో 175, నారాయణపేటలో 132, నాగర్ కర్నూల్లో 210, గద్వాల్లో 142, వనపర్తిలో 133. సూర్యాపేటలో 235, నల్గొండలో 352, భువనగిరిలో 178, వరంగల్లో 130, హన్మకొండలో 129, ములు గులో 84, మహాబూబాద్లో 193, భూపాలపల్లి 109. జనగామలో 134, ఖమ్మంలో 288, కొత్తగూడెంలో 288లో ఉన్నాయి .
Read hindi news: hindi.vaartha.com
Read ALso : Nimisha Priya: నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా