తెలంగాణ రాష్ట్రంలో మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ (Distribution of Ration Rice) కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంది. జూన్తో పాటు జులై, ఆగస్టు నెలల రేషన్ను ఒకేసారి అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 92.18 శాతం లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీ పూర్తయ్యింది. ఇందులో భాగంగా 5.27 లక్షల టన్నుల సన్నబియ్యం ప్రజలకు సరఫరా చేశారు.
ఎల్లుండితో గడువు ముగింపు
కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మూడు నెలల రేషన్ పంపిణీ చేపట్టింది. అయితే, రేషన్ పంపిణీకి గడువు ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. కనుక ఇంకా రేషన్ తీసుకోని లబ్ధిదారులు ఉంటే వారు ఎల్లుండి (జూన్ 30) లోపు తమకు చేరువలో ఉన్న రేషన్ షాపులకు వెళ్లి బియ్యం తీసుకోవాల్సి ఉంది. ఈ గడువు ముగిసిన తర్వాత రేషన్ అందుకోవడం కష్టమవుతుంది.
లబ్ధిదారుల జాగ్రత్త అవసరం
ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమం ద్వారా లబ్ధిదారులకు ముందుగానే త్రైమాసిక రేషన్ అందిస్తూ ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో అనేక కుటుంబాలు ఉపశమనం పొందాయి. ఇంకా రేషన్ తీసుకోని వారు తక్షణమే రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు తీసుకొని దగ్గర్లోని FP shop కు వెళ్లి బియ్యం తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇది ఓ అవకాశంగా భావించి గడువులోపు తమ రేషన్ ను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Also : RSS-BJPలకు రాజ్యాంగం అవసరం లేదు – రాహుల్