📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

సింగరేణి లో ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు ఘనంగా నిర్వహించాలి – సింగరేణి ఛైర్మెన్

Author Icon By Sudheer
Updated: November 30, 2024 • 10:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా నిర్వహించనున్న ‘ప్రజాపాలన -ప్రజా విజయోత్సవాలు’ కార్యక్రమాన్ని రా ష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో సింగరేణిలో ఘనంగా నిర్వహించాలని, దీనికోసం అన్ని ఏరియాలలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సింగరేణి ఛైర్మెన్ మరియు ఎండీ ఎన్.బలరామ్ ఆదేశించారు. శనివారం ఆయన ప్రజా విజయోత్సవాల నిర్వహణపై ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా డిసెంబర్ 4వ తేదీన పెద్దపల్లిలో నిర్వహించే యువశక్తి సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతులమీదగా 9000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందివ్వనున్నారని, వీటిలో సింగరేణి సంస్థలో ఇటీవల కొత్తగా ఉద్యోగాలు పొందిన 593 మందికి కూడా నియామక పత్రాలు అందజేయనున్నారని తెలిపారు. ఇందుకోసం తగు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీనికోసం తగు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణి సంస్థ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అనేక కొత్త పథకాలను, కార్యక్రమాలను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు.

ఏడాది కాలంలో 2,165 కొత్త ఉద్యోగాలను కల్పించడం జరిగిందని, చరిత్రలో అత్యధికంగా 33% లాభాల వాటా బోనస్ ను కార్మికులకు పంపిణీ చేయడం జరిగిందని, ఒక్కొక్కరికి రూ.1,90,000 వరకు లాభాల వాటా అందిందని పేర్కొన్నారు. అలాగే తొలిసారిగా కాంట్రాక్టు కార్మికులకు కూడా 5వేల రూపాయల లాభాల వాటా పంపిణీ చేయడం జరిగిందన్నారు.

congress Praja Palana Vijayostsavalu singareni

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.