📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

సంగారెడ్డిలో భారీగా పట్టుబడిన డ్రగ్స్‌

Author Icon By Vanipushpa
Updated: December 13, 2024 • 11:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

డ్రగ్స్ కంట్రోల్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆశించిన ఫలితం రావడం లేదు. తాజాగా సంగారెడ్డిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. న్యూ ఇయర్ దగ్గ రపడుతున్న వేళా డ్రగ్స్ దొరకడం కలకలం సృష్టిస్తున్నది. డ్రగ్స్ ను ఏపీ నుంచి ముంబైకి తరలిస్తున్న సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు అలెర్ట్ అయ్యారు.
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లిలో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. మొగడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
ఈ క్రమంలో ఓ లారీలో డ్రగ్స్‌ను గుర్తించి వాటిని సీజ్‌ చేశారు. వాటి విలువ రూ.50 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఓడరేవు నుంచి వాటిని ముంబైకి తరలిస్తున్నారని తెలుస్తున్నది.
పట్టుబడిన డ్రగ్స్‌ను చిరాగ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా, లారీ డ్రైవర్‌, క్లీనర్‌ పరారైన్లు అధికారులు వెల్లడించారు.ఈ తనిఖీల్లో డీఆర్‌ఐ, నార్కొటిక్‌ డ్రగ్స్‌ కంట్రోల్‌, సెంట్రల్‌ విజిలెన్స్‌ అధికారులు పాల్గొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్‌ను ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు, దీనివెనక ఎవరున్నారనే విషయమై ఆరాతీస్తున్నారు. న్యూ ఇయర్ సందర్బంగా పెద్ద ఎత్తున ఆంధ్ర, తెలంగాణాలో డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు పోలీసులకు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.

#drugs Ap

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.