📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

లిక్కర్ ధరల పెంపు ఎప్పుడంటే?

Author Icon By Vanipushpa
Updated: January 17, 2025 • 1:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు రాష్ట్రాల్లో మద్యం ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ ఆదాయంతోనే ప్రభుత్వాలు తమ మనుగడకు సాగించేలా వున్నాయి. తాజాగా తెలంగాణలో మద్యం ధరల పెంపుకు రంగం సిద్దమైంది. ధరల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది. ధరల పెంపు పైన ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక ఆధారంగానే నిర్ణయం ఉండాలని డిసైడ్ అయ్యారు. అయితే, ధరల పెంపు పైన లిక్కర్ కంపెనీల నుంచి వస్తున్న ఒత్తిడితో తాజాగా అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

ప్రభుత్వ కమిటీ.. అధికారుల ప్రతిపాదనల పైన అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం.. ధరల పెంపు పైన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కొంత కాలంగా మద్యం ధరల పెంపు పైన చర్చ సాగుతోంది. అయితే, ప్రభుత్వం ఈ విషయంలో గతంలోనే స్పష్టత ఇచ్చింది. కొన్నేళ్లుగా మద్యం ధరలు పెంచకపోవటంతో.. తయారీ కంపెనీలు పెంపు కోసం ఒత్తిడి పెంచాయి. మద్యం ధరల పెంపు పైన అధ్యయనం.. సిఫార్సుల కోసం ప్రభుత్వం హైకోర్టు మాజీన్యాయమూర్తి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల కమిటీని ఆరు నెలల క్రితమే ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జూలై 18న తొలిసారి సమావేశమైంది. జూలై 25లోగా మద్యం కంపెనీలు సరఫరాకు ధరలు కోట్‌ చేయాలని సర్క్యులర్‌ జారీ చేసింది.

కంపెనీల నుంచి వచ్చిన సీల్డ్ కవర్లను ఓపెన్ చేసి ధరలను పరిశీలన చేసింది. 91 కంపెనీలు ఆ సమయంలో ముందుకు వచ్చాయి. రాష్ట్రంలో గత నాలుగేళ్ల కాలంలో మద్యం ధరలు పెరగలేదు. తాజాగా యునైటెడ్ బేవరేజస్ కంపెనీ లిమిటెడ్ తమ ఉత్పత్తుల పైన కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి లేఖ ద్వారా తమ నిర్ణయం వెల్లడించింది. ఇక, తాజాగా మద్యం ధరల పెంపు అంశం పైన ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. కమిటీ నివేదిక ప్రకారమే నిర్ణయాలు ఉండాలని సీఎం రేవంత్ స్పష్టం చేసారు. కాగా, ధరల పెంపు తప్పదని అధికారుల అంచనా.

liquor rates Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.