📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

రాజ్యాంగం ఒక్కటే సకల సమస్యలకు పరిష్కారం – డిప్యూటీ సీఎం భట్టి

Author Icon By Sudheer
Updated: December 6, 2024 • 3:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జాతి అభ్యున్నతికి విద్య ప్రాధాన్యతను బీఆర్ అంబేద్కర్ బోధించారని, అందుకే ఆయన అనేక విశ్వవిద్యాలయాలను స్థాపించారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూలో జరిగిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..అంబేద్కర్ భావజాలం సమసమాజ స్థాపనకు మార్గదర్శకమని ఆయన తెలిపారు. అంబేద్కర్ ఆకాంక్షను ప్రతిపాదిస్తూ యువత మేధస్సు సమాజ అభ్యున్నతికి ఉపయోగపడాలని పేర్కొన్నారు. రాజ్యాంగం సకల సమస్యలకు పరిష్కార మార్గమని, అసమానతల్ని తొలగిస్తే భారత్ ప్రపంచంలో నెంబర్‌వన్ స్థానంలో ఉండేదని ఆయన చెప్పారు. విద్యతోనే అన్ని సమస్యలను అధిగమించవచ్చని అంబేద్కర్ నమ్మకాన్ని గుర్తు చేశారు.

సంవిధాన్ సమ్మాన్ బచావ్ కార్యక్రమం ద్వారా రాజ్యాంగ పరిరక్షణకు ప్రజల చైతన్యాన్ని పెంపొందించడమే లక్ష్యమని చెప్పారు. భారత రాజ్యాంగం ఒక్కటే అన్ని సమస్యలకు సమగ్ర పరిష్కారమని, ప్రతి ఒక్కరూ దానిని చదవాలని మల్లు భట్టి సూచించారు. రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని చెప్పుకొచ్చారు.

భారతదేశం మానవ వనరుల పరంగా ఎంతో అభివృద్ధి చెందగల శక్తి కలిగి ఉందని, ప్రపంచాన్ని జయించే మేధస్సు మనలో ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే, జాతుల మధ్య విభేదాలు, పోరాటాలు ఈ శక్తిని నిర్వీర్యం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజాన్ని సమతామార్గంలో నడిపేందుకు ప్రజలందరూ ఒక్కటిగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

bhatti vikramarka pay tribute to Ambedkar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.