హైదరాబాద్ : రవాణా శాఖలో డిటిసిలు, జెటిసిలుగా పదోన్నతులు పొందిన అధికారులకు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం ఆదేశాలు జారీ చేశారు. జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లుగా పదోన్నతి పొందిన ఎం.చంద్రశేఖర్ గౌడ్ కు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఐటి జాయింట్ ట్రాన్స్పోర్టు కమిషనర్ గాను, శివలింగయ్యకు అడ్మినిస్ట్రేటివ్, ప్లానింగ్ జాయింట్ ట్రాన్స్ పోర్టు కమిషనర్గా ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్లుగా పదోన్నతులు పొందిన రవీందర్ కుమార్ కు అదిలాబాద్ డిటిసిగా, ఎన్.వాణిని నల్గొండ డిటిసిగా, ఆఫ్రిన్ సిద్ధిఖీని కమిషనర్ నార్యాలయంలో డిటిసిగా, కిషన్ కు మహబూబ్నగర్ డిటిసిగా, సదానందందకు రంగారెడ్డి డిటిసిగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
రవాణా శాఖలో పదోన్నతి పొందిన అధికారులకు పోస్టింగులు
By
Digital
Updated: December 23, 2024 • 10:41 AM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.