📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

మెడిక‌ల్ విద్యార్థుల‌కు కాంగ్రెస్ మోసం: హ‌రీశ్‌రావు

Author Icon By Vanipushpa
Updated: December 18, 2024 • 2:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మెడిక‌ల్ విద్యార్థుల‌కు జ‌రిగిన న‌ష్టానికి పూర్తి బాధ్య‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వానిదే అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. మెడికల్ అడ్మిషన్‌ల‌లో కాంగ్రెస్ ప్రభుత్వం లోకల్ కోటా నిబంధనలు స్థానికుల అవకాశాలను దెబ్బ తీస్తాయ‌ని మేము ఆనాడే చెప్పాం. ఈ రోజు కాంగ్రెస్ తెచ్చిన లోకల్ కోట నియమాలను హైకోర్ట్ రద్దు చేసింది. ఎంబీబీఎస్ అడ్మిషన్లు ఆ తప్పుడు నియమాలతో జరిగినందు వలన వందల మంది స్థానిక అభ్యర్థులకు నష్టం జరిగింది అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.
తెలంగాణలో ఎంబీబీఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌/బీఏఎంఎస్‌ చేసినవారికి స్థానిక కోటా పరిధిలోనే పీజీ కోర్సుల్లో అడ్మిషన్‌లు కల్పించాల్సి ఉంటుందని హైకోర్టు తేల్చి చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఈ అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు స్పందించారు.
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అడ్మిషన్లు
రాష్ట్రం వెలుపల చదివిన, ఇన్‌సర్వీసు అభ్యర్థులకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అడ్మిషన్‌లు కల్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది. పీజీ మెడికల్‌, పీజీ (ఆయుష్‌) అడ్మిషన్‌ల నిబంధనలు 2021లోని నిబంధన 8కి సవరణ తీసుకువస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 148, 149లను కొట్టివేస్తూ మంగళవారం 106 పేజీల తీర్పును వెలువరించింది. ప్రభుత్వానికి నిబంధనలు తీసుకురావడంతోపాటు వాటిని సవరించే అధికారం ఉందని, అయితే అది చట్టానికి అనుగుణంగా ఉండాలని పేర్కొంది. తెలంగాణలో విద్యకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోనే ఉన్నాయని తేల్చి చెప్పింది.

స్థానిక కోటాకు పీజీ మెడికల్‌, పీజీ (ఆయుష్‌) అడ్మిషన్‌లకు సంబంధించి 2021 పీజీ మెడికల్‌ అడ్మిషన్‌ల నిబంధన-8కి సవరణ తీసుకువస్తూ ప్రభుత్వం అక్టోబరు 28న తీసుకువచ్చిన జీవో 148, 149లను సవాలు చేస్తూ దాదాపు 98 పిటిషన్‌లు దాఖలయ్యాయి. వీటిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించడంగానీ, రద్దు చేయడంగానీ చేయలేదని అందువల్ల అన్వయించుకున్నట్టు భావించాలని ధర్మాసనం పేరొంది.

harish rao medical students Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.