📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

మళ్లీ టీబీజేపీ పగ్గాలు బండి సంజయ్ కేనా..?

Author Icon By Sudheer
Updated: January 4, 2025 • 12:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో బీజేపీ నాయకత్వంలో ఓ కీలక మార్పు జరగబోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ అధిష్టానం తిరిగి బండి సంజయ్‌కి రాష్ట్రం లో బీజేపీ పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మళ్లీ టీబీజేపీ పగ్గాలు బండి సంజయ్ కేనా..? బండి సంజయ్ గతంలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తెలంగాణ బీజేపీకి మంచి జోష్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన నాయకత్వంలో బీజేపీ గత ఎన్నికల్లో అనూహ్య విజయాలను సాధించింది. ముఖ్యంగా హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటెల విజయం వెనుక బండి సంజయ్ కష్టం ఎంతో ఉంది.

ఇక, రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పగ్గాల కోసం ప్రస్తుతం పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఎంపీలు అరవింద్, రఘునందన్రావు, డీకే అరుణ, మరియు ఈటల రాజేందర్ ఉన్నారు. అయితే, బండి సంజయ్ పట్ల పార్టీ లో ఉన్న నమ్మకం, ఆయన ప్రజలతో ఉన్న అనుబంధం కారణంగా ఆయనకే మళ్ళీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.

Also Read: రైతు భరోసా విధివిధానాలు ఖరారైనట్లేనా..?

ఇంకా, బీజేపీ అధిష్టానం ఈటల రాజేందర్ ను కేంద్రమంత్రిగా నియమించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్ తెలంగాణలో బీజేపీకి కీలకమైన నేతగా ఉన్నారు. అలాగే ఆయనపై గౌరవం కూడా ఎక్కువగా ఉంది. ఆయనకు కేంద్రంలో పదవిని ఇచ్చి తెలంగాణలో పార్టీని మరింత శక్తివంతం చేయాలని ఆ పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి. ఈ నిర్ణయాలు తెలంగాణలో బీజేపీ రాజకీయాలకు ఒక కీలక మలుపుగా మారిపోతుందనే సూచనలున్నాయి. రాష్ట్రంలో పార్టీ బలాన్ని పెంచుకోవడానికి, పోటీని మరింత ఉత్కంఠంగా మార్చేందుకు ఈ పరిణామాలు కీలకంగా మారవచ్చు. మరి కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.

Bandi sanjay telangana bjp president

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.