हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

మధ్య తరగతి ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్

Sudheer
మధ్య తరగతి ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్

తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం ఇందిరమ్మ గృహ నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రేపటి నుంచి (డిసెంబర్ 6) పదిరోజుల పాటు గ్రామాల్లో లబ్ధిదారులను గుర్తించనున్నట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సొంత స్థలం ఉన్న కుటుంబాల్లో ఆడబిడ్డ పేరుతో ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు నాలుగు విడతల్లో అందజేస్తామన్నారు. పునాది దశలో రూ. లక్ష, కిటికీ స్థాయిలో రూ. 1.75 లక్షలు, శ్లాబు దశలో రూ. 1.25 లక్షలు, చివరిదశలో మిగిలిన రూ. లక్ష అందజేస్తామన్నారు.

మధ్యతరగతి ప్రజల కోసం కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా గృహ నిర్మాణ ప్రణాళికను రూపొందించింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ పరిధిలో మూడు ప్రాంతాల్లో 300 ఎకరాల్లో మధ్యతరగతి ప్రజలకు ఇండ్లను నిర్మించి ఇస్తామని మంత్రి వెల్లడించారు. విజయవాడ రహదారి, కామారెడ్డి మార్గం, ముంబై హైవే ప్రాంతాల్లో ఒక్కో ప్రాంతంలో 100 ఎకరాల్లో ఇండిపెండెంట్ ఇళ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు.

ఇందిరమ్మ గృహ నిర్మాణంలో మొదటి ఏడాదిలోనే 4.5 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో నియోజకవర్గానికి తొలి విడతలో 3500 ఇండ్లను కేటాయిస్తామని మంత్రి చెప్పారు. ఈ గృహ నిర్మాణ ప్రణాళిక తదుపరి నాలుగేళ్లలో కొనసాగుతుందని, పేదలకు అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి నిధులు పారదర్శకంగా గ్రీన్ ఛానెల్ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. కులం, మతం, రాజకీయ సంబంధాలు ఏమి చూడకుండా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని హామీ ఇచ్చారు. పేదలకు సరైన గృహాలు అందించడం ద్వారా రేవంత్ సర్కార్‌ తమ హామీలను నెరవేర్చనుంది.

తెలంగాణ ప్రజల ఆశల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తూ, పేదలకు సరైన ఆశ్రయం కల్పించేందుకు ముందడుగు వేస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదలకు ఇళ్లు మంజూరు చేయడం ద్వారా ప్రభుత్వం తన సామాజిక బాధ్యతను చూపిస్తోంది. ఈ కార్యక్రమాలు రాష్ట్రంలో పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870