📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

భ‌ట్టి వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నాం : హ‌రీశ్‌రావు

Author Icon By Vanipushpa
Updated: December 17, 2024 • 12:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శాస‌న‌స‌భ‌లో బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధ కొనసాగుతున్నది. తాజాగా
ఉచిత విద్యుత్‌కు బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించ‌లేద‌న్న‌ ఆర్థిక శాఖ మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క చేసిన వ్యాఖ్య‌ల‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు ఖండించారు.
శాస‌న‌స‌భ‌లో హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ఉచిత విద్యుత్‌కు రూ. 65 వేల కోట్లు విద్యుత్ శాఖ‌కు చెల్లించామ‌ని స్ప‌ష్టం చేశారు. కానీ భ‌ట్టి విక్ర‌మార్క త‌ప్పుడు లెక్క‌లు చెబుతూ స‌భ‌ను, ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని మండిప‌డ్డారు.
ఒక్క ప్రాజెక్టు క‌ట్ట‌లేదు
ఈ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏడాది కాలంలో రూ. 1,27,208 కోట్లు అప్పు చేసి కొత్త‌గా ఒక్క ప్రాజెక్టు కూడా క‌ట్ట‌లేదు. మా హ‌యాంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాం. మిష‌న్ భ‌గీర‌థ ద్వారా మంచినీటిని అందించాం. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఆస్తుల క‌ల్ప‌న చేసింది.. కానీ కాంగ్రెస్ ప్ర‌భుత్వం మాత్రం అప్పులు చేసి క‌మీష‌న్ల కోసం పంచుకుతిన్నారు. ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు తెలియ‌జేయాల్సిన అవ‌స‌రం ఉంది. అస‌లు తాము అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇవ్వ‌కుండా భ‌ట్టి ఏదేదో మాట్లాడుతున్నారు. త‌మ హ‌యాంలో వ‌డ్లు కొన్నాం.. ఠంచ‌న్‌గా పైస‌లు ఇచ్చాం. భ‌ట్టి విక్ర‌మార్క వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినా రైతులకు న్యాయం జరగలేదని, ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి అని హ‌రీశ్‌రావు విమర్శించారు. ఎన్నికలో పేదలకు మేలు చేస్తాం అని గెలిచి ఇపుడు ఏమి పట్టించుకోవడం లేదని హ‌రీశ్‌రావు అన్నారు.

assemble harish rao Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.