📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

బీఆర్ఎస్ పై రేవంత్ కీలక వ్యాఖ్యలు

Author Icon By Vanipushpa
Updated: January 16, 2025 • 4:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో అమలు చేసిన విధంగా పథకాలను అమలు చేసే బాధ్యత తాను తీసుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ హామీ ఇచ్చారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ హయాంలో చోటు చేసుకున్న అవినీతి గురించి చెప్పుకొచ్చారు. తాము ఏడాది కాలంలోనే తెలంగాణలో ప్రజా పాలన కోసం ఎన్నో మార్పులు తెచ్చామని వివరించారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎప్పుడూ జరగని విధంగా తమ హయాంలో 21 వేల కోట్ల మేర రుణమాఫీ అమలు చేసామని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీ అమలు చేస్తున్నామంటూ పథకాల వారీగా వివరించారు.

తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు తీరును వివరించారు. ఢిల్లీలో కాంగ్రెస్ గెలిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఇటు కేటీఆర్ ఈడీ ఎదుట విచారణ హాజరు వేళ తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి గురించి కేటీఆర్ ప్రస్తావించారు. అవినీతిని అడ్డుకుంటే చాలు ఆ నిధులు పేదలకు పంచవచ్చని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో యువతకు ఏడాదిలో 55 వేల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం విజయవంతంగా కొనసాగుతుందని తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే హామీలు అమలు అవుతాయని హామీ ఇచ్చారు. సోనియా గాంధీ మాట ఇస్తే కట్టుబడి ఉంటారని రేవంత్ చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి చాలా నష్టం జరిగినా సరే.. తెలంగాణ విషయంలో హామీ నిలబెట్టుకున్నారు తప్ప వెనుకడుగు వేయలేదని ఉద్ఘాటించారు. కేసీఆర్ తెలంగాణను దోచుకున్నారని మండిపడ్డారు.

delhi Delhi Assembly Elections Revanth Reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.